అభివృద్ధిని విస్మరిస్తున్న కాంగ్రెస్ సర్కార్
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
రాయపర్తి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ లోకి భారీగా చేరికలు
కాకతీయ, నడికూడ : హన్మకొండ జిల్లా నడికూడ మండలంలోని రాయపర్తి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ ఎస్ పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్ అకినపెల్లి లింగయ్య, నాయకులు కోడెపాక బాబులు, చెన్న గణేష్తో పాటు పలువురు నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అమలు చేయలేని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను పూర్తిగా విస్మరిస్తోందని అన్నారు. దోపిడీ మరియు స్కాంలకే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రాధాన్యతిస్తుందని ఆరోపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో పోటీచేస్తున్న అభ్యర్థులందరిని భారీ మెజారిటీలతో గెలిపించి కేసీఆర్కు,తెలంగాణ భవిష్యత్కు బలమైన మద్దతు ఇవ్వాలని కోరారు.
కాంగ్రెస్ మాయమాటలకు మరోసారి మోసపోవద్దని ఆయన గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


