epaper
Tuesday, April 7, 2026
epaper

కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు

కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు
గ‌జ్వేల్ ఘ‌ట‌న ప్రజాస్వామ్యంపై దాడే
కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై ప్ర‌ణాళిక‌తోనే దాడి
మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు
నిర‌స‌న‌గా గజ్వేల్ బంద్‌కు బీఆర్ఎస్ పిలుపు
వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా
ఉద్రిక్తతల మధ్య ఉదయం నుంచి నిలిచిన జనజీవనం

కాకతీయ,గజ్వేల్: ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని, కాంగ్రెస్ గూండాలు అధికారం అండతో రెచ్చిపోయారని తన్నీరు హరీష్ రావు మాజీ మంత్రి మండిపడ్డారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపుతో సోమవారం గజ్వేల్ బంద్ కొనసాగింది. ఉదయం 5 గంటల నుంచే గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలు పూర్తిగా బంద్‌లో మునిగిపోయాయి. దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. బంద్ ప్రభావంతో స్థానిక వ్యాపారులు నష్టపోయారు. కేసీఆర్ నియోజకవర్గంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం బీఆర్ఎస్ శ్రేణులను కలిచివేసింది. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉంచి నినాదాలు చేశారు. గ్రామ పాలన మీటింగ్‌లో ఫ్లెక్సీ తొలగింపుతో ప్రారంభమైన వివాదానికి ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపించింది.

గజ్వేల్ చరిత్రలో ఇది రెండోసారి

గజ్వేల్ రాజకీయాల్లో క్యాంపు కార్యాలయం లక్ష్యంగా మారడం రెండోసారి జరిగింది. గతంలో బీజేపీ నాయకులు శాంతియుతంగా నిరసన తెలిపారు. ఎలాంటి ధ్వంసం జరగలేదు. కానీ తాజా ఘటనలో అద్దాలు పగలగొట్టడం, ఫర్నిచర్ ధ్వంసం జరిగిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. రెండు నిరసనల తీరులో స్పష్టమైన తేడా కనిపిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ అరాచకానికి ప్రజలు సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. బంద్ సందర్భంగా గజ్వేల్‌లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆంక్షారెడ్డి ప్రయత్నం.. ఉద్రిక్తత

బంద్‌ను వ్యతిరేకిస్తూ ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు షాపులు తెరిపించే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలతో వాగ్వాదాలు, స్వల్ప తోపులాటలు జరిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ నాయకులు ఆంక్షారెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఘటన సమయంలో పోలీసులు ఉన్నప్పటికీ అడ్డుకోలేదని బీఆర్ఎస్ విమర్శించింది. మధ్యాహ్నం వరకు బంద్ కొనసాగింది. ఆ తర్వాత షాపులు తిరిగి తెరుచుకున్నాయి. రోడ్లపై రద్దీ కనిపించింది. గజ్వేల్‌లో పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంది. ఈ ఘటన గజ్వేల్ రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకువస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ గజ్వేల్‌కు రాకపోవడం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీల మధ్య ఈ వివాదం మరింత వేడెక్కింది.
రాజకీయాల వల్ల వ్యాపారం దెబ్బతినకూడదని వ్యాపారులు కోరుతున్నారు. పార్టీలు సంయమనం పాటించాలని సూచిస్తున్నారు. గజ్వేల్‌లో శాంతి భద్రతలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రైతులపై నిర్లక్ష్యం వహిస్తే పుట్టగతులు ఉండవు

రైతులపై నిర్లక్ష్యం వహిస్తే పుట్టగతులు ఉండవు సీఎం విజిట్ పేరుతో హడావిడిగా...

కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడించిన డీసీసీ అధ్యక్షులు అంక్షారెడ్డి

కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడించిన డీసీసీ అధ్యక్షులు అంక్షారెడ్డి - సీఎం రేవంత్...

చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం * సీఐ రమేష్ నాయక్ కాకతీయ, చేర్యాల: వేసవిలో దాహం...

ప్రేమ వివాహం విషాదాంతం

ప్రేమ వివాహం విషాదాంతం మొన్న ప్రియుడు.. నేడు ప్రియురాలు ఆత్మ‌హ‌త్య‌ చేర్యాల మండలం ముస్త్యాల...

చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించండి

చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించండి * సీఎం రేవంత్ రెడ్డికి లేఖ...

హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి

హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి * కరపత్రాల ఆవిష్కరణ చేసిన కమిటీ సభ్యులు కాకతీయ,చేర్యాల:చేర్యాల...

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా-పాలన, గ్రామసభలు

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా-పాలన, గ్రామసభలు * రాంపూర్ సర్పంచ్ శెట్టే కొమురయ్య కాకతీయ,చేర్యాల:...

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి * విద్యార్థి కీర్తన మృతి పట్లv సంతాపాన్ని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img