epaper
Thursday, March 12, 2026
epaper

తొర్రూరు మున్సిపల్‌ పోరులో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

తొర్రూరు మున్సిపల్‌ పోరులో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి
కాంగ్రెస్‌ నాయ‌కుల‌కు మంత్రి వాకిటి శ్రీహరి
పట్టణ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వేం నరేంద‌ర్ రెడ్డి

కాకతీయ, తొర్రూరు : రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరాలని, పట్టణ పీఠాలన్నింటినీ కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. తొర్రూరులోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వ చీఫ్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పదేళ్ల ప్రభుత్వ అహంకారాన్ని పది రోజుల్లోనే దించిన ఘనత ప్రజలదేనని అన్నారు. ప్రజా ప్రభుత్వానికి మరింత బలం చేకూరాలంటే మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను భారీ మెజారిటీలతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లే పార్టీలోనూ ఉంటాయని, వాటిని సరిదిద్దుకొని ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. సర్పంచ్‌ స్థాయి నుంచి రాష్ట్ర మంత్రి స్థాయి వరకు ఎదిగిన అనుభవాన్ని గుర్తు చేస్తూ, కార్యకర్తలు కూడా ఈ స్థాయి నుంచి ఏ స్థాయికైనా ఎదగవచ్చని నేతలు ధైర్యం చెప్పారు. ప్రజలతో మమేకమై పనిచేస్తే రాజకీయంగా ఎదుగుదల సాధ్యమని పేర్కొన్నారు.

ప‌దేళ్ల‌లో అప్పుల రాష్ట్రంగా మార్చారు..

మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్‌ పాలనలో అప్పుల రాష్ట్రంగా మార్చారని నేతలు విమర్శించారు. నెలనెలా అప్పుల వడ్డీలకే సరిపోతున్న పరిస్థితి తీసుకువచ్చారని అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ హయాంలో మంత్రులకే సీఎం అపాయింట్‌మెంట్‌ దొరకని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం సామాన్యులకూ సీఎం అపాయింట్‌మెంట్‌ లభిస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీకి కృషి చేస్తామని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మున్సిపల్‌ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు.

మినీ స్టేడియం మంజూరుకు హామీ

అనంతరం పాలకుర్తి నియోజకవర్గంలో మినీ స్టేడియం మంజూరు చేయాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మంత్రి వాకిటి శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి మినీ స్టేడియం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి స్పందనకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజల మోసం

అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజల మోసం - కోట్ల రూపాయలు వసూలు...

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట!

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట! ప్రభుత్వ విప్, డాక్టర్ జాటోతు. రామచంద్రు నాయక్, కాకతీయ,మరిపెడ:...

తెలంగాణ రాష్ట్రంలోవైద్య రంగానికి పెద్దపీట!

తెలంగాణ రాష్ట్రంలోవైద్య రంగానికి పెద్దపీట! ప్రభుత్వ విప్, జాటోతు. రామచందర్ నాయక్, కాకతీయ,మరిపెడ: ఆరోగ్య...

ప్రభుత్వ పాఠశాలలో ప‌దో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు

ప్రభుత్వ పాఠశాలలో ప‌దో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కాకతీయ, పెద్దవంగర :...

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి *ఏర్పాట్లను పరిశీలించిన...

వచ్చారు వెళ్లారు !

వచ్చారు వెళ్లారు ! తూతూమంత్రంగా నీటి పారుదలశాఖ డీఈ తనిఖీలు అక్రమ తవ్వకాలు కనిపిస్తున్నా,...

స్మశాన వాటికను మరో చోటుకి మార్చాలి

స్మశాన వాటికను మరో చోటుకి మార్చాలి - తహసీల్దార్, ఇంచార్జ్ ఎంపీడీవోకు, ఎస్ఐకి...

కొమ్మాల జాతరకు రూ.21,22,410/- ఆదాయం

కొమ్మాల జాతరకు రూ.21,22,410/- ఆదాయం *రూ.13,39,710/- హుండీ ఆదాయం *వివిధ ఆర్థిక సేవల ద్వారా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img