epaper
Sunday, March 1, 2026
epaper

ప్రజల తీర్పుతోనే కాంగ్రెస్ అధికారంలోకి

ప్రజల తీర్పుతోనే కాంగ్రెస్ అధికారంలోకి
అసెంబ్లీకి రాని కేసీఆర్ కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లా
బీఆర్ఎస్ నేతల విమర్శలు భయానికి నిదర్శనం
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కాకతీయ, కరీంనగర్ : మార్పును కోరిన ప్రజల స్పష్టమైన తీర్పుతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి మంత్రి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ప్రజల తీర్పుకు నిదర్శనమన్నారు. గత పాలనలో ప్రజా సమస్యలను విస్మరించిన బీఆర్ఎస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండేళ్ల పాటు ఫామ్‌హౌస్‌కే పరిమితమై ప్రజలతో సంబంధం కోల్పోయారని తీవ్రంగా విమర్శించారు.

ప్రజాస్వామ్యాన్ని అవమానించిన తీరు

అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించినా, ఇరిగేషన్ వంటి కీలక అంశాలపై చర్చ జరిగినప్పుడు కేసీఆర్ హాజరు కాకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని మంత్రి ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లులపై కీలక చర్చలు జరిగినా అసెంబ్లీకి రాకపోవడం ద్వారా ప్రజా సమస్యలపై ఆయనకు ఎంతమాత్రం ఆసక్తి లేదని స్పష్టమైందన్నారు. ప్రజలను అవహేళనగా మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు పార్టీ ఉనికి ప్రమాదంలో పడిందన్న భయంతోనే బయటకు వచ్చి విమర్శలు చేస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. గత పాలనలో బడ్జెట్‌ను విచ్చలవిడిగా దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి పేదల కలలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి పదవిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఎవరి దయదాక్షిణ్యాలతోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని స్పష్టం చేశారు. కేటీఆర్‌లో అహంకారం స్పష్టంగా కనిపిస్తోందని, హరీశ్‌రావు బాధ్యతలేని వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img