పోచయ్య మృతికి వంటేరు సంతాపం
కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ మండలంలోని సింగాటం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభాకర్, ప్రసాద్ తండ్రి పూదూరి వంజరి పోచయ్య మృతి చెందారు. ఆయన మృతి పట్ల గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి మృతుడి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోచయ్య పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బెండే మధు, గజ్వేల్ మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ స్వప్న సురేష్, తాటికొండ మధుసూదన్ రెడ్డి, బొగ్గుల సురేష్, గొడుగు స్వామి, మల్లేశం, శ్రీనివాస్, ఆందోలు కిష్టారెడ్డి, నర్సింలు, లింగాగౌడ్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.


