epaper
Wednesday, March 4, 2026
epaper

పెండింగ్ పనులు పూర్తి చేయండి..!

పెండింగ్ పనులు పూర్తి చేయండి..!
రోడ్డు విస్తరణకు ప్రజల సహకారం అవసరం
ప్రజలను ఒప్పించి రోడ్డు విస్తరణ ప్ర‌క్రియ‌ పూర్తి చేయాలి
నాలుగు కాలాలు నిలిచేలా నాణ్యమైన పనులు
రాజకీయాలకతీతంగా అభివృద్ధి కొనసాగాలి
ఖమ్మం నగరాభివృద్ధిపై మంత్రి తుమ్మల స్పష్టమైన ఆదేశాలు
9వ డివిజన్‌లో సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన

కాకతీయ, ఖమ్మం : పెండింగ్‌లో ఉన్న నగరాభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత–జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. శనివారం ఖమ్మం నగర 9వ డివిజన్ రోటరీనగర్‌లో రూ.35 లక్షల వ్యయంతో 400 మీటర్ల మేర నిర్మించనున్న సీసీ డ్రైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నగరాన్ని కొత్తగా చూసినవారికి స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, ముఖ్యంగా పారిశుధ్యం గణనీయంగా మెరుగుపడిందని అన్నారు. కార్పొరేషన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను మిగిలిన నాలుగు నెలల్లో తప్పనిసరిగా పూర్తి చేయించుకోవాలని కార్పొరేటర్లకు సూచించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు.

రోడ్డు విస్తరణకు ప్రజల సహకారం అవసరం

నగరంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యేందుకు స్థానిక కార్పొరేటర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని మంత్రి తెలిపారు. విస్తరణ వల్ల నష్టపోయే పేదలకు ప్రత్యామ్నాయంగా ఇళ్లు, స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో టీడీఆర్ విధానాన్ని కూడా అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. రోడ్డు విస్తరణతో వ్యాపారాలు పెరుగుతాయని, ఆస్తుల విలువ కూడా అధికమవుతుందని పేర్కొన్నారు. సైడ్ డ్రైన్లపై ఫుట్‌పాత్‌లు పూర్తి చేసి లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలను ఒప్పించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. నగరంలో చేపట్టిన రోప్‌వే, వెలుగు మట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. లకారం నిర్వహణలో లోపాలపై ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ రూ.35 లక్షలతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టామని, అవసరమైన ఇతర పనులకు కూడా మంజూరు లభించిందన్నారు. 9వ డివిజన్‌లో విద్యుత్ స్తంభాల తరలింపునకు ఎన్పిడిసిఎల్‌కు చెల్లింపులు పూర్తయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, మునిసిపల్ ఇంజనీర్లు, ఎన్పిడిసిఎల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

దాతల సాయం కోసం ఎదురుచూపు!

దాతల సాయం కోసం ఎదురుచూపు! పుట్టుకతో అంగవైకల్యం.. ఇప్పుడు షుగర్ వ్యాధి కాటు ఆపరేషన్‌కు...

బతికుండగానే ‘చంపేసి’ కోట్లు దోచేశారు!

బతికుండగానే ‘చంపేసి’ కోట్లు దోచేశారు! భద్రాచలం ఎల్ ఐసీ శాఖలో రూ. 1.52...

కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి మెడికల్ బోర్డు నిర్వహణలో నిర్లక్ష్యం డిస్మిస్ ఉద్యోగులకు...

మహాసభలను జయప్రదం చేయండి

మహాసభలను జయప్రదం చేయండి సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ నేత‌ కందగట్ల సురేందర్ పిలుపు కాకతీయ,...

అభివృద్ధికి మారుపేరు తుమ్మల

అభివృద్ధికి మారుపేరు తుమ్మల ప్రతిపక్షాలు తుమ్మల ప్రతిష్ఠపై బురదజల్లే ప్రయత్నం ప్రజలు కర్రుకాల్చి వాత...

రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు

రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు కాకతీయ, కొత్తగూడెం రూరల్: రాహుల్...

విశిష్ట సేవలు చిరస్మరణీయం

విశిష్ట సేవలు చిరస్మరణీయం కాకతీయ, కొత్తగూడెం రూరల్ : లక్ష్మీదేవిపల్లి మండల సూపరింటెండెంట్‌గా...

శ్మ‌శాన వాటిక సమస్యపై కలెక్టర్‌కు వినతి

శ్మ‌శాన వాటిక సమస్యపై కలెక్టర్‌కు వినతి ఆక్రమణలు తొలగించాలని సర్పంచ్ మంద కరుణ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img