బల్దియాలో కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
స్థితి గతుల పరిశీలన
కాకతీయ, వరంగల్ : బల్దియా ప్రధాన కార్యాలయంతో పాటు నక్కల గుట్ట సర్కిల్ కార్యాలయంలో కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ లు నిర్వహించారు.
ప్రధాన కార్యాలయంలోని నూతన భవనంలోగల ఐసిసిసి, అకౌంట్స్ విభాగం, ఐటి విభాగం, ఇంజనీరింగ్ విభాగం, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్, టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన దస్త్రాలు భద్రపరిచే గది, వెటర్నరీ విభాగం, పోస్ట్ ఆడిట్, హార్టికల్టర్ విభాగం, ఇంజనీరింగ్ రికార్డ్ సెక్షన్ ను సందర్శించి ఫైళ్ళ నిర్వహణ తీరును అడిగి కమిషనర్ తెలుసుకున్నారు. సందర్శన నేపధ్యంలో కమిషనర్ వివిధ విభాగాల గదుల స్థితి గతులు,ఆయా విభాగాల్లో పని చేసే సిబ్బంది నిర్వహించే విధుల తీరును అడిగి తెలుసుకున్నారు.
తనిఖీలో కమిషనర్ వెంట ఎంహెచ్ఓ డా.రాజేష్, సూపరిండెంట్ ఆనంద్ తదితరులు ఉన్నారు.


