జీహెచ్ఎంసీలో కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా క్షేత్రస్థాయి పర్యటన
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో పారిశుధ్య పనుల పరిశీలన
ఎమ్మెల్యే కాలనీలో ఖాళీ స్థలాన్ని పార్క్గా అభివృద్ధి చేయాలని ఆదేశం
కాకతీయ, హైదరాబాద్ : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలోని పారిశుధ్య పరిస్థితులు, పౌర సేవల నిర్వహణపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఆయన పర్యటించి పారిశుధ్య పనులను సమీక్షించారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రియాంక ఆలాతో కలిసి పలు ప్రాంతాలను సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. బంజారాహిల్స్లోని ఎన్బీటీ నగర్, అపోలో ఆసుపత్రి సమీపంలోని చెత్త నిల్వ ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. నగరంలో చెత్త పేరుకుపోయే ప్రదేశాలను పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. చెత్త నిల్వ ప్రాంతాలను గుర్తించి వెంటనే తొలగించడం ద్వారా నగర పరిశుభ్రతను మెరుగుపరచాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య నిర్వహణను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఖాళీ స్థలాన్ని పార్క్గా అభివృద్ధి
జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలో పారిశుధ్య పనులను సమీక్షించిన అనంతరం ఎంఎల్ఏ కాలనీలోని ఖాళీ స్థలాన్ని కమిషనర్ పరిశీలించారు. ఆ స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడేలా పార్క్గా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నగర పరిశుభ్రత, పౌర సేవల మెరుగుదలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సూచించారు.


