రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి
కలెక్టర్ గరిమ అగ్రవాల్
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : వేసవి వడగాలుల వల్ల కలిగే నష్టాలను తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ, అటవీ శాఖ, అగ్నిమాపక శాఖ, కార్మిక శాఖ, వ్యవసాయ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేసవి జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన అవగాహన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ప్రజలకు వడగాలుల నుంచి రక్షణపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, వైద్యాధికారి రజిత, వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, డీఆర్డీఓ గీత, మిషన్ భగీరథ అధికారులు అన్వర్, సుమలత, జిల్లా పంచాయతీ అధికారి షరీఫుద్దిన్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


