epaper
Saturday, March 7, 2026
epaper

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం

బీఆర్ఎస్ హయాంలోనే సాగునీటి విప్లవం
ఎల్లంపల్లి, మిడ్ మానేర్, వరద కాలువ పనులు మా కృషే
రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు
బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు. శనివారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల సమీపంలోని వరద కాలువను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం వరద కాలువలో ప్రవహిస్తున్న నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతల చేసినవేనని పేర్కొన్నారు. ఇటీవల లక్ష్మీ పంప్ హౌస్ మోటార్లు నడిపి కాలువలోకి నీటిని వదిలినప్పటికీ కాళేశ్వరం లేదని సీఎం చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని అన్నారు. వరద కాలువ ఆధారంగా చొప్పదండి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, బాల్కొండ తదితర నియోజకవర్గాల్లో పంటలు సాగుతున్నాయని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సాగునీటి కేంద్రంగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. కాంగ్రెస్ హయాంలో పూర్తికాని ఎల్లంపల్లి ప్రాజెక్టును రూ.2052 కోట్ల వ్యయంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. అలాగే మిడ్ మానేర్ ప్రాజెక్టును రూ.1526 కోట్లకు పైగా ఖర్చు చేసి పూర్తి చేసి కాళేశ్వరం జలాలతో నింపినట్లు తెలిపారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ పునరుజ్జీవన పథకం కింద సుమారు రూ.2000 కోట్లతో వరద కాలువను పునరుద్ధరించి ఏడాది పొడవునా నీరు ఉండేలా చేశామని చెప్పారు. వరద కాలువను రిజర్వాయర్‌లా అభివృద్ధి చేసి రెండు వైపులా తూములు ఏర్పాటు చేయడంతో వేలాది ఎకరాల్లో పంటలు సాగుతున్నాయని పేర్కొన్నారు.

ప్రాజెక్టులు పూర్తి చేసిన బీఆర్ఎస్, విమర్శలతోనే కాంగ్రెస్

సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు మల్కపేట రిజర్వాయర్, మెట్పల్లి ప్రాంతానికి నీరు అందించే సదర్మాట్ ప్రాజెక్టు, హుస్నాబాద్ ప్రాంతానికి సాగునీరు అందించే గౌరవెల్లి ప్రాజెక్టు వంటి పలు సాగునీటి ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందని హరీశ్ రావు తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టులో 96 శాతం పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసినప్పటికీ మిగిలిన పనులను కూడా ప్రస్తుత ప్రభుత్వం పూర్తిచేయలేకపోతోందని విమర్శించారు. గత రెండున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం ఒక్క కొత్త సాగునీటి ప్రాజెక్టును కూడా ప్రారంభించలేదని, ఇప్పటికే 70–80 శాతం పూర్తైన పనులను కూడా ముందుకు తీసుకెళ్లలేకపోతోందని ఆరోపించారు. మేడిగడ్డ వద్ద కొన్ని పిల్లర్లు దెబ్బతిన్నాయని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని ప్రచారం చేయడం సరైంది కాదని హరీశ్ రావు అన్నారు. అవసరమైన మరమ్మతులు చేపడితే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పనిచేస్తుందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం విమర్శలకే పరిమితం కాకుండా సాగునీటి పనులను ముందుకు తీసుకెళ్లాలని హ‌రీష్‌రావు డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

క‌రీంన‌గ‌ర్‌ను ఆద‌ర్శంగా నిలుపుతాం..

క‌రీంన‌గ‌ర్‌ను ఆద‌ర్శంగా నిలుపుతాం.. మేయర్ కొలగాని శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి కాకతీయ, కరీంనగర్ కార్పొరేష‌న్...

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు కాకతీయ, రామగుండం : నగరంలో చేపట్టిన కాలువ పూడికతీత...

పొన్నం రవిచంద్రకు

పొన్నం రవిచంద్రకు గద్దర్ ఫిల్మ్ అవార్డు ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీగా ‘ద ఫస్ట్...

ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్

ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో శనివారం మున్సిపాలిటీ...

హామీల అమలుపై నిలదీయాలి

హామీల అమలుపై నిలదీయాలి బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ కాకతీయ, కరీంనగర్ :...

పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం

పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం కాకతీయ కరీంనగర్ : ‘ప్రజా పాలన –...

గురుకుల ఘటనపై చర్యలు తీసుకోవాలి

గురుకుల ఘటనపై చర్యలు తీసుకోవాలి కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లి మహాత్మా...

మెడికల్ స్టోర్‌లో అగ్ని ప్రమాదం

మెడికల్ స్టోర్‌లో అగ్ని ప్రమాదం జమ్మికుంట, కాకతీయ: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలోని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img