epaper
Friday, January 16, 2026
epaper

18న పాలేరుకు సీఎం రేవంత్‌

18న పాలేరుకు సీఎం రేవంత్‌
▪️ రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
▪️ మున్నేరు–పాలేరు లింక్ కెనాల్‌కు శ్రీకారం
▪️ జేఎన్‌టీయూ, నర్సింగ్ కళాశాలలతో విద్యకు ఊపిరి
▪️ కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన
▪️ మున్సిపల్ ఎన్నికలపై కార్యకర్తలకు సీఎం దిశానిర్దేశం
▪️ హైదరాబాద్ వెలుపల తొలిసారి మేడారంలో క్యాబినెట్ భేటీ
రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి

కాకతీయ, కూసుమంచి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా రూ.362 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు కీలక అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు. మద్దులపల్లిలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన, నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులకు సీఎం శ్రీకారం చుడతారని వెల్లడించారు. రైతాంగానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్‌ను సీఎం ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కూసుమంచి మండలంలో రూ.వ్యయంతో నిర్మించనున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి కూడా శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొంటారని వెల్లడించారు. ఇదే వేదికగా రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారని చెప్పారు.

హైదరాబాద్ వెలుపల తొలిసారి క్యాబినెట్ భేటీ

రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ నెల 18న మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వెలుపల క్యాబినెట్ భేటీ జరగడం ఇదే తొలిసారని తెలిపారు. ఇది చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. సమ్మక్క–సారలమ్మ మహాజాతరను కుంభమేళాకు మించి అద్భుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని మంత్రి చెప్పారు. మేడారంలో కాకతీయుల నాటి వైభవం ప్రతిబింబించేలా నిర్మించిన రాతి కట్టడాలను ఈ నెల 19న ఉదయం ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు. గత ప్రభుత్వాల్లా ఎన్నికల వేళ బొమ్మలు చూపడం తమ అలవాటు కాదని, ప్రజల మధ్య ఉండి నిరంతరం పనిచేసే ప్రభుత్వమిదని స్పష్టం చేశారు. అలాగే గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని పునరుద్ఘాటించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు.. ఎన్నిక‌లే త‌రువాయి..!

రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు.. ఎన్నిక‌లే త‌రువాయి..! ఖమ్మం కార్పోరేష‌న్‌, మునిసిపాలిటీల్లో రిజ‌ర్వేష‌న్ల కేటాయింపు బీసీలకు పెరిగిన‌...

నిబంధనల గీత దాటొద్దు!

నిబంధనల గీత దాటొద్దు! భద్రత, ప్రోటోకాల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి మినిట్ టు మినిట్...

సీఎం పర్యటనతో ఖమ్మంలో ట్రాఫిక్ ఆంక్షలు

సీఎం పర్యటనతో ఖమ్మంలో ట్రాఫిక్ ఆంక్షలు ▪️ 18న ఉదయం 11 నుంచి...

మైనార్టీ గురుకులాలకు దర‌ఖాస్తుల ఆహ్వానం

మైనార్టీ గురుకులాలకు దర‌ఖాస్తుల ఆహ్వానం 2026–27 విద్యా సంవత్సరానికి రిజిస్ట్రేషన్ ప్రారంభం ఐదో తరగతి...

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img