epaper
Thursday, January 15, 2026
epaper

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు శ్రీకారం
ఎర్పాట్లపై హై అలర్ట్
మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమీక్ష

కాకతీయ, ములుగు ప్రతినిధి : ఈ నెల 18న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారానికి రానున్న నేపథ్యంలో, అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
బుధవారం మేడారం హరిత హోటల్‌లో మంత్రి సీతక్క అధ్యక్షతన జిల్లా కలెక్టర్ దివాకర, జిల్లా ఎస్పీ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్‌లతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రోటోకాల్‌, భద్రత, వసతి, రవాణా, సాంస్కృతిక కార్యక్రమాలు, జాతర ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు.

జిల్లాకు గర్వకారణంగా మారాలి

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మేడారానికి చేరుకున్న అనంతరం అక్కడే బస చేయనున్నారని తెలిపారు. 19వ తేదీన శ్రీ సమ్మక్క–సారలమ్మ గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణ పనులకు ప్రారంభోత్సవం చేయనున్నట్లు వెల్లడించారు. 18వ తేదీన రాష్ట్ర స్థాయి యంత్రాంగం మొత్తం మేడారంలోనే ఉండనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని జిల్లాకు గర్వకారణంగా మలచాలని అధికారులను కోరారు.
18వ తేదీ ఆదివారం కావడం, పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ముగియడం వల్ల భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ దృష్టితో ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మేడారం అభివృద్ధి పనుల్లో సహకరిస్తున్న జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ప్రోటోకాల్‌, బందోబస్తు, వసతి, సాంస్కృతిక కార్యక్రమాలు, జాతర ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. హెలిప్యాడ్ నిర్వహణ పనులను ఆర్‌ అండ్‌ బీ శాఖకు అప్పగించినట్లు చెప్పారు. మేడారం జాతరతో పాటు గద్దెల ప్రాంగణ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ముఖ్యమంత్రి, వీఐపీ ప్రోటోకాల్ బాధ్యతలను ఆర్డీఓ వెంకటేష్‌కు అప్పగించినట్లు వెల్లడించారు.
ముఖ్యమంత్రి నిర్వహించే బహిరంగ సభకు జిల్లాలో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. అలాగే ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించేలా ధింసా, కోయ, గుస్సాడి, కొమ్ము కోయ వంటి సంప్రదాయ సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి భద్రత, రూట్ మ్యాప్, పార్కింగ్, గార్డ్ ఆఫ్ ఆనర్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రామ్‌నాథ్ కేకన్ పర్యవేక్షించనున్నారని తెలిపారు. పోలీసు శాఖ పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి, భక్తులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేష్, జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొని తమ శాఖల ద్వారా చేయాల్సిన ఏర్పాట్లపై నివేదికలు సమర్పించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

జూదం ఆడుతున్న 12 మంది అరెస్ట్..

జూదం ఆడుతున్న 12 మంది అరెస్ట్.. రూ.2.39 లక్షల నగదు, 12 మొబైల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img