మహబూబాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి: ఆదివారం మహబూబాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఇటీవలనే బిగ్ టీవీ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వెన్నం విజయ్ కాంత్ రెడ్డి, వెన్నం శ్రీకాంత్ రెడ్డి సోదరుల తండ్రి రాఘవేందర్ రెడ్డి ఇటీవల మరణించారు. వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం రెడ్యాల గ్రామానికి చేరుకుంటారు. దివంగత వెన్నం రాఘవేందర్ రెడ్డి చిత్రపత్రానికి నివాళులు అర్పించి, వెన్నం సోదరులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు రెడ్యాలనుంచి బయలుదేరుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం మూడున్నర గంటలకు దేవాదుల ప్రాజెక్టుకు చేరుకొని సాయంత్రం ఐదు గంటల వరకు దేవాదుల ప్రాజెక్టును సందర్శించి, రివ్యూ నిర్వహిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు అక్కడ నుంచి బయలుదేరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం బేగంపేట కు 5.50 నిమిషాలకు చేరుకుంటారు.


