పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్
22 మంది లబ్ధిదారులకు రూ. 16 లక్షల విలువైన చెక్కుల పంపిణీ
ప్రజా సంక్షేమమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయం
ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్యం మరియు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య పేర్కొన్నారు. శుక్రవారం వరంగల్ నగరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. మొత్తం 22 మంది బాధితులకు రూ. 16 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బస్వరాజ్ సారయ్య మాట్లాడుతూ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని ఆర్థికంగా భారమైన పేదల దరఖాస్తులను స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి సిఫారసు చేసి, నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్నా రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అహర్నిశలు పేదల అభ్యున్నతికి కృషి చేస్తోందని, ఇది పేదల ప్రభుత్వం అని కొనియాడారు. అనారోగ్య కారణాలతో ఆర్థిక సహాయం కోరుకునే వారు నేరుగా తనను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండేటి నరేంద్ర కుమార్, బస్వరాజు శిరీష శ్రీమాన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయూబ్, పీసీసీ సభ్యులు నల్లగొండ రమేష్, నగర మహిళా అధ్యక్షురాలు నారగోని స్వప్న-మురళి గౌడ్, సీనియర్ నాయకులు రాజనాల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.


