ఆపదలో ఆదుకుంటున్న సీఎం రిలీఫ్ ఫండ్
ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ రెడ్డి
36 మందికి 8.81 లక్షల చెక్కుల పంపిణీ
కాకతీయ, కారేపల్లి : ఆపదలో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ రెడ్డి తెలిపారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. మంగళవారం సింగరేణి మండలంలో 36 మంది లబ్ధిదారులకు 8.81 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. అవసరంలో ఉన్న కుటుంబాలకు ఈ సహాయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్లు తమ గ్రామాల అభివృద్ధికి సంబంధించిన వినతిపత్రాలను ఎంపీకి అందజేశారు. గ్రామాలకు అవసరమైన నిధులు, సౌకర్యాలపై సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సింగరేణి మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఇమ్మడి తిరుపతి రావు, అజ్మీరా నరేష్, సర్పంచ్లు అజ్మీరా ఉమా నరేష్, వడ్డే సులోచన రంగారావు, మోతీ వీరస్వామి, ధారావత్ వెంకటేశ్వర్లు, గూగులోతు కృష్ణవేణి వీరబాబు, దండు ప్రవీణ్, ఉండం రాఘవులు, దరావత్ హేమ, గూగులోతు వరలక్ష్మి, కొమ్ము భద్రం, బానోత్ రూప్లా నాయక్, పొడుగు పెంటయ్య, మండల అధ్యక్షులు తలారి చంద్ర ప్రకాష్, పాటి నర్సయ్య, వార్డు మెంబర్ దారావత్ రమేష్ నాయక్, ఆదేర్ల అంజయ్య, తోగర శ్రీను, జర్పుల ధోనీ నాయక్, ఈసం లక్ష్మీ నర్సు, హర్ష నాయక్, నరేష్, బద్దె నాయక్, రవీందర్ రెడ్డి, రెడ్డబోయిన జగయ్య, గుంపిడి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.


