చిగురుమామిడి కూరగాయల మార్కెట్ వేలం ₹1,21,000..
*వేలంపాటను కైవాసం చేసుకున్న సందవెని కనకయ్య
కాకతీయ,చిగురుమామిడి : మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో 2026-27సంవత్సరమునకు గాను ప్రతి సోమవారం ఉదయం నిర్వహించే కూరగాయల మార్కెట్ వేలము గ్రామ సర్పంచ్ ఆకవరం భవాని శివప్రసాద్ సమక్షంలో శనివారం పెద్ద ఎత్తున నిర్వహించారు.ఈ వేలంలో పాటలో 8మంది పోటీ పడగా చిగురుమామిడి గ్రామానికి చెందిన సందవేణి వెంకటయ్య 1,21,000 రూపాయలకు మార్కెట్ వేలము పాట పాడి దక్కించుకున్నారు.గత సంవత్సరం 89వేల ఒక వంద వేలం రాగా,ఈ సంవత్సరం ఆదాయం మరింత గణనీయంగా పెరిగింది.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కాశబోయిన విజయలక్ష్మి రాజు యాదవ్,గ్రామపంచాయతీ కార్యదర్శి రమేష్,చిగురుమామిడి గ్రామవార్డు సభ్యులు పోతర్ల శివాంజనేయులు,పోతారవేణి అనిల్,నాగేల్లి హరీష్,రాకం అనిల్ కుమార్,రాకం అంజమ్మ, చెరుకు సమ్మయ్య,గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


