కాకతీయ, పరకాల: బీఆర్ఎస్ పరకాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి తల్లి రేగూరి రంగమ్మ శుక్రవారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రంగమ్మ పార్దివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆమె మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పరకాల నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు మునగాల సురేందర్ రావు, లింగమూర్తి, చిరంజీవి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


