epaper
Friday, January 16, 2026
epaper

వరద నష్టాలపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి తనిఖీ

వరద నష్టాలపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి తనిఖీ
▪️ మొంథా తుపాన్‌తో హనుమకొండలో తీవ్ర నష్టం
▪️ పంటలు, రోడ్లు, ఇళ్లపై సమగ్ర అంచనాలు
▪️ వరద ముంపు గ్రామాల్లో ప్రత్యక్ష పరిశీలన
▪️ రైతులు, బాధితులతో మాట్లాడిన అధికారులు
▪️ నష్టాల ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలన

కాకతీయ, హనుమకొండ : అక్టోబర్ నెలలో మొంథా తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా హనుమకొండ జిల్లాలో సంభవించిన వరద ముంపు, పంట నష్టం, రోడ్లు కోతకు గురవ్వడం, ఇండ్లు కూలిపోవడం వంటి విస్తృత నష్టాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం శుక్రవారం జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించింది. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ, నష్టాల తీవ్రతపై వివరాలు సేకరించింది. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి కేంద్ర బృందం ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామాన్ని సందర్శించి, వరద ధాటికి దెబ్బతిన్న ప్రధాన రహదారిని పరిశీలించింది. ఈ సందర్భంగా రైతులు, స్థానికులతో మాట్లాడిన అధికారులు పంటలకు జరిగిన నష్టం, రహదారుల పరిస్థితి, రాకపోకలకు ఏర్పడిన ఇబ్బందులపై వివరాలు తెలుసుకున్నారు.

పంటలు–రోడ్లకు భారీ దెబ్బ

వరదల కారణంగా పంట పొలాలు ముంపునకు గురైన తీరు, రహదారులు కొట్టుకుపోయిన పరిస్థితులను కేంద్ర బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. పంట నష్టాలకు సంబంధించిన ఛాయాచిత్రాల ప్రదర్శనను కూడా అధికారులు పరిశీలించి, నష్టాల తీవ్రతపై అవగాహన పొందారు. అనంతరం దేవునూరు–ముప్పారం గ్రామాల మధ్య ఉన్న లో లెవెల్ బ్రిడ్జి సమీపంలో వరదల వల్ల దెబ్బతిన్న వ్యవసాయ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

కూలిన ఇళ్లు… బాధితుల వేదన
ముప్పారం గ్రామంలో భారీ వర్షాల కారణంగా తోట కమలమ్మకు చెందిన ఇల్లు కూలిపోవడంతో ఆ ఇంటిని సందర్శించిన కేంద్ర అధికారులు, బాధిత మహిళతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. అలాగే భీమదేవరపల్లి మండలం విశ్వనాథ కాలనీలో వరదలకు దెబ్బతిన్న కాలువను, కొప్పూరులో వర్షాలకు కూలిన ఇంటిని కూడా పరిశీలించారు. అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హనుమకొండ సమ్మయ్య నగర్, గోపాల్‌పూర్ ఊర చెరువు కట్ట, వరద ముంపుకు గురైన అమరావతి నగర్ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌లతో కలిసి కేంద్ర బృందం సందర్శించింది. వరద ముంపుతో పట్టణ ప్రాంతాల్లో ఎదురైన సమస్యలను అధికారులు అక్కడికక్కడే పరిశీలించారు. ఈ పర్యటనలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేష్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, పంచాయతీరాజ్ ఈఈ ఆత్మారామ్, విద్యుత్ శాఖ ఎస్ఈ మధుసూదన్, ఆర్ & బి అధికారులు గోపీకృష్ణ, ఉదయ్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కేంద్ర బృందం సేకరించిన వివరాల ఆధారంగా రాష్ట్రానికి, కేంద్రానికి సమగ్ర నివేదిక అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ధరణి–భూభారతి స్కామ్‌ గుట్టు రట్టు

ధరణి–భూభారతి స్కామ్‌ గుట్టు రట్టు 15 మంది అరెస్టు… మరో 9 మంది...

పదేళ్ల తప్పులు సరిదిద్దుతున్నాం!

పదేళ్ల తప్పులు సరిదిద్దుతున్నాం! కక్షసాధింపు అనడం సిగ్గుచేటు ఇష్టమొచ్చినట్లు జిల్లాల విభజన బీఆర్ఎస్ పాపం వరంగల్...

ఉచిత విద్యుత్‌తో పేదింట్లో వెలుగులు

ఉచిత విద్యుత్‌తో పేదింట్లో వెలుగులు గృహజ్యోతి పథకంతో ఆర్థిక ఊరట అబ్బాయిపాలెం గ్రామ సర్పంచ్...

క్రీడలతోనే యువతకు మానసిక ఉల్లాసం

క్రీడలతోనే యువతకు మానసిక ఉల్లాసం ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు కాకతీయ, ఆత్మకూరు...

ఇంత అన్యాయ‌మా..?

ఇంత అన్యాయ‌మా..? డోర్నకల్, మరిపెడ మునిసిపాలిటీల్లో బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు సున్నా మహబూబాబాద్‌లో 6 బీసీ...

మేడారం జాత‌ర‌కు పోటెత్తిన భ‌క్తులు

మేడారం జాత‌ర‌కు పోటెత్తిన భ‌క్తులు మేడారం నుంచి జాకారం వ‌ర‌కు ట్రాఫిక్ జాం గ‌ట్ట‌మ్మ...

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img