epaper
Monday, March 2, 2026
epaper

ఇండ్ల మధ్య సెల్ టవర్లు… ప్రజల్లో ఆందోళన

ఇండ్ల మధ్య సెల్ టవర్లు… ప్రజల్లో ఆందోళన
రేడియేషన్ భయం… అనుమతులపై అనుమానాలు
సాయినగర్‌లో టవర్ నిర్మాణానికి వ్యతిరేకంగా అందోళన

కాకతీయ, మణుగూరు :  మణుగూరు మండలాల్లో ఇండ్ల మధ్య సెల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారన్న వార్తలతో స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. జనావాసాల నడుమ టవర్లు నిర్మించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుతం ప్రతి ఇంట్లో సెల్ ఫోన్ వినియోగం పెరిగిన నేపథ్యంలో టవర్ల సంఖ్య కూడా అధికమవుతోంది. అయితే ఇవి నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం సరైనదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు అనారోగ్యానికి గురవుతారనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పక్షుల ఉనికి తగ్గిపోవడానికి కూడా ఇదే కారణమని కొందరు చెబుతున్నారు.

సెల్ టవర్ నిర్మాణం చేయొద్దని అధికారికి వినతిపత్రం అందించిన గ్రామస్థులు…

ఇండ్ల మధ్య టవర్ల ఏర్పాటు

మండలంలోని సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని సాయినగర్ ప్రాంతంలో సెల్ టవర్ నిర్మాణం చేపట్టినట్లు సమాచారం. టవర్ నిర్మించబోయే ప్రదేశానికి చుట్టుపక్కల యాభై మీటర్ల పరిధిలో అనేక ఇళ్లు ఉన్నాయి. ఇలాంటి ప్రాంతంలో టవర్ ఏర్పాటు చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని స్థానికులు మండిపడుతున్నారు.టవర్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన విధానంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు సరైన పరిశీలన లేకుండా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముడుపుల కోసం ఇండ్ల మధ్య టవర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ కొందరు నాయకులు విమర్శిస్తున్నారు.

రేడియేషన్ వల్ల ప్రాణాలకు ముప్పు…?

జనావాసాల మధ్య ఉన్న టవర్ల నుంచి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని కొందరు మేధావులు చెబుతున్నారు. ఐదు వందల నుంచి వెయ్యి మీటర్ల పరిధిలో ప్రభావం ఉంటుందని అంటున్నారు. క్యాన్సర్, నిద్రలేమి, నరాల బలహీనత వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భయపడుతున్నారు.అలాగే పటిష్ఠంగా లేని భవనాలపై భారీ బరువున్న టవర్లు ఏర్పాటు చేయడం భవిష్యత్తులో ప్రమాదాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు.ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు నిలదీస్తున్నారు. జనావాసాల మధ్య టవర్లకు అనుమతులు ఎలా ఇస్తున్నారో వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.సాయినగర్ ప్రాంత ప్రజలు టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సరైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. తమ అభ్యర్థనలను పట్టించుకోకపోతే ఆందోళనకు దిగుతామని, అవసరమైతే టవర్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.జనావాసాల మధ్య సెల్ టవర్ల ఏర్పాటుపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించి ప్రజల్లో నమ్మకం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు స్పందించి ప్రజల అనుమానాలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి అధికారుల‌కు క‌లెక్ట‌ర్ ఆదేశాలు కలెక్టరేట్‌లో ప్రజల అర్జీల స్వీకరణ కాకతీయ,...

సహజ రంగులతో హోళీ జరుపుకోవాలి

సహజ రంగులతో హోళీ జరుపుకోవాలి ఎస్పీ రోహిత్ రాజ్‌ కాకతీయ, కొత్తగూడెం రూరల్: హోళీ...

స్మార్ట్ కిడ్జ్‌లో హోలీ సంబరాలు

స్మార్ట్ కిడ్జ్‌లో హోలీ సంబరాలు ముందస్తుగా రంగుల పండుగ వేడుకలు సహజ రంగులతో చిన్నారుల...

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణంలో పట్టువస్త్రాల సమర్పణ

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణంలో పట్టువస్త్రాల సమర్పణ కాకతీయ, కారేపల్లి: ఖమ్మం...

ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరుకండి

ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరుకండి పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి...

మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీ

మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీ కాకతీయ, కూసుమంచి: కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామ...

కరువులో ‘ఉపాధి’ దీపం వెలిగించిన సర్పంచ్

కరువులో ‘ఉపాధి’ దీపం వెలిగించిన సర్పంచ్ కాకతీయ, కారేపల్లి: కరువు కాటుతో పంటలు...

పేదల గృహ స్వప్నాలకు ప్రభుత్వం తోడుగా

పేదల గృహ స్వప్నాలకు ప్రభుత్వం తోడుగా 14 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img