పుట్ట మధుకు సీబీఐ నోటీసులు
రేపు రామగుండంలో విచారణకు రావాలని ఆదేశం
వామనరావు దంపతుల హత్య కేసులో కీలక పరిణామం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో సంచలనం సృష్టించిన వామన్ రావు దంపతుల హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంథని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన విచారణకు హాజరుకానున్నారు. హైకోర్టు అడ్వకేట్స్ నాగమణి వామన్ రావు దంపతుల జంట హత్య కేసు విచారణలో సీబీఐ స్పీడ్ పెంచింది. ఈక్రమంలో పుట్ట మధుకు నోటీసులు జారీ చేయడం కలకలంరేపింది. రేపు రామగుండంలో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. ఇక ఇప్పటికే మృతుడు వామనరావు తండ్రి కిషన్ రావుతో పాటు వారి కుటుంబీకులు, బంధువులు పలువురిని సీబీఐ విచారించింది. కాగా రామగుండం కమిషనరేట్ కేంద్రంగా గత నెల రోజుల నుంచి ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరుగుతోంది. అయితే పుట్ట మధు సీబీఐ విచారణతో ఈ కేసుకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.


