epaper
Wednesday, March 4, 2026
epaper

భారత్‌కు రాలేం!

భారత్‌కు రాలేం!
టీ20 వరల్డ్‌కప్‌పై బంగ్లా బోర్డు కఠిన వైఖరి
శ్రీలంకకు మ్యాచ్‌లు తరలించాలని బీసీబీ డిమాండ్
ఐసీసీతో సమావేశంలోనూ వెనక్కి తగ్గని బీసీబీ
ఐర్లాండ్‌తో గ్రూప్ మార్పిడి ప్రతిపాదన
వచ్చే వారం తుది నిర్ణయం తీసుకోనున్న ఐసీసీ

కాక‌తీయ‌, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్‌కప్‌–2026కు సంబంధించి భారత్‌కు రావడాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తిరస్కరించింది. భద్రతా కారణాలను చూపుతూ తమ మ్యాచ్‌లను భారత్‌ నుంచి శ్రీలంకకు తరలించాలని ఐసీసీని అధికారికంగా కోరింది. ఈ అంశంపై శనివారం జరిగిన సమావేశంలోనూ బీసీబీ తన వైఖరిని మార్చుకోబోమని స్పష్టం చేసింది. భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 వరల్డ్‌కప్‌పై ఈ పరిణామం కొత్త వివాదానికి దారి తీసింది. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ, బీసీబీ వెనక్కి తగ్గకపోవడంతో ఐసీసీ తుది నిర్ణయం కీలకంగా మారింది. భారత్‌లో బంగ్లాదేశ్ జట్టు, అభిమానులు, మీడియా ప్రతినిధులు, ఇతర స్టేక్‌హోల్డర్ల భద్రతపై తమ ప్రభుత్వానికి తీవ్ర ఆందోళన ఉందని బీసీబీ ఐసీసీకి తెలిపింది. ఈ కారణంగానే తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని అధికారికంగా అభ్యర్థించినట్లు వెల్లడించింది. ఈ అంశాన్ని బీసీబీ ఇప్పటికే పలుమార్లు ఐసీసీ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తాజాగా జరిగిన సమావేశంలో మరోసారి స్పష్టం చేసింది.

గ్రూప్ మార్పిడితో సమస్యకు పరిష్కారం?

వివాదానికి తక్కువ లాజిస్టికల్ ఇబ్బందులతో పరిష్కారం చూపేందుకు బీసీబీ ఓ ప్రత్యామ్నాయ ప్రతిపాదనను ముందుంచింది. ప్రస్తుతం ఉన్న గ్రూప్ వ్యవస్థలో మార్పులు చేసి, బంగ్లాదేశ్‌ను ఐర్లాండ్‌తో గ్రూప్ మార్పిడి చేయాలని సూచించింది. ఈ ప్రతిపాదన ప్రకారం బంగ్లాదేశ్ గ్రూప్‌–సీకి మారి, తమ అన్ని లీగ్ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడుతుంది. ఐర్లాండ్‌ను గ్రూప్‌–బీలోకి మార్చుతారు. ఐర్లాండ్ ఇప్పటికే కొలంబో, పల్లెకెలే వేదికలపై మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో, ఈ మార్పుతో పెద్దగా షెడ్యూల్ సమస్యలు ఉండవని బీసీబీ భావిస్తోంది. ఈ వివాదానికి నేపథ్యంగా ఇటీవల జరిగిన మరో పరిణామం కూడా చర్చకు వచ్చింది. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్, బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను జట్టు నుంచి విడుదల చేసింది. ఈ నిర్ణయం బీసీసీఐ ఆదేశాల మేరకే జరిగిందన్న కథనాలు రావడంతో, భారత్–బంగ్లాదేశ్ క్రికెట్ సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరిగినట్లు భావిస్తున్నారు. శనివారం జరిగిన సమావేశంలో ఐసీసీ తరఫున ఈవెంట్స్‌, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగం జీఎం గౌరవ్ సక్సేనా, ఇంటెగ్రిటీ యూనిట్ జీఎం ఆండ్రూ ఎఫ్గ్రేవ్ పాల్గొన్నారు. వీసా ఆలస్యంతో గౌరవ్ సక్సేనా ఆన్‌లైన్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. బీసీబీ తరఫున అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం, ఉపాధ్యక్షులు షకావత్ హొసేన్‌, ఫరూక్ అహ్మద్‌, క్రికెట్ ఆపరేషన్స్ కమిటీ ఛైర్మన్ నజ్ముల్ అబేదీన్‌, సీఈవో నిజాముద్దీన్ చౌదరి హాజరయ్యారు. సమావేశం నిర్మాణాత్మకంగా సాగిందని, సమస్య పరిష్కారానికి చర్చలు కొనసాగిస్తామని బీసీబీ వెల్లడించింది. మరోవైపు, అన్ని అంశాలపై అంతర్గతంగా సమీక్షించిన అనంతరం వచ్చే వారం తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు ఐసీసీ వర్గాలు సూచించాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది కానీ..

క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది కానీ.. అనిల్ కుంబ్లే భావోద్వేగ‌మైన పోస్టు..! కాక‌తీయ‌, స్పోర్ట్స్...

సెమీస్ ప‌రీక్ష‌కు సిద్ధమైన భారత్..!

సెమీస్ ప‌రీక్ష‌కు సిద్ధమైన భారత్..! రెండు సార్లు కప్ గెలిచిన మ‌నోధైర్యం జ‌ట్టుకు...

ఇంగ్లాండ్‌కు సెమిస్ స‌వాల్‌..!

ఇంగ్లాండ్‌కు సెమిస్ స‌వాల్‌..! రెండు టైటిళ్లను ఎగ‌రేసుకుపోయిన ఇంగ్లీష్ జ‌ట్టు ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో ఏడు...

మహిళా క్రికెట్‌లో మహారాణి..

మహిళా క్రికెట్‌లో మహారాణి.. దిగ్గజాలను దాటేసిన హర్మన్‌ప్రీత్ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళగా రికార్డు కాక‌తీయ‌,...

సూపర్ 8లోకి జింబాబ్వే ..

సూపర్ 8లోకి జింబాబ్వే .. ప్రపంచ విజేతలకే చుక్కలు చూపిస్తున్న ప‌సికూన‌ అంచ‌నాల‌కు అంద‌కుండా...

ప్రపంచకప్​లో నెదర్లాండ్స్​ బోణీ

ప్రపంచకప్​లో నెదర్లాండ్స్​ బోణీ నమీబియాపై 7 వికెట్ల తేడాతో విజయం ఆల్​రౌండ్ ప్రదర్శనతో రాణించిన...

జట్టు ప్రయోజనాలే ముఖ్యం

జట్టు ప్రయోజనాలే ముఖ్యం గంభీర్, సూర్యకుమార్ విజ్ఞప్తిని తిరస్కరించిన బీసీసీఐ మెగా టోర్నీ సందర్భంగా...

రూ. 1560 కోట్ల భారీ లాస్ నుంచి తప్పించుకున్న ఐసీసీ

రూ. 1560 కోట్ల భారీ లాస్ నుంచి తప్పించుకున్న ఐసీసీ పాకిస్థాన్ అనూహ్య...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img