epaper
Thursday, January 15, 2026
epaper

ప్రశాంతంగా పోలింగ్

ప్రశాంతంగా పోలింగ్
ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికలు
ఉమ్మడి క‌రీంన‌గ‌ర్‌ జిల్లాలో 79.77% పోలింగ్ నమోదు

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ గ్రామీణ పంచాయతీలతో పాటు పట్టణ శివార్లలో కూడా నాలుగు గంటల పాటు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగి మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. ఓటర్లు ప్రారంభం నుంచే కేంద్రాలకు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో అనేక ప్రాంతాల్లో క్యూలైన్లు కనిపించినప్పటికీ పోలింగ్ సిబ్బంది సమన్వయం వల్ల ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదు. తొలి విడతలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల నాలుగు జిల్లాల పరిధిలోని ఎంపిక చేసిన మండలాల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 4 జిల్లాలో కలిపి 22 మండలాల్లో ఓటింగ్ నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ జరుగుతున్న ప్రధాన కేంద్రాలను సంబంధిత జిల్లాల కలెక్టర్లు ప్రత్యక్షంగా సందర్శించి పోలింగ్ ఏర్పాటులను సమీక్షించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ హర్ష, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఎన్నికల అధికారి గరిమ అగ‌ర్వాల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ సిబ్బంది, రిటర్నింగ్ అధికారులు గ్రామ స్థాయి బృందాలతో సమావేశమై అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశారు. భద్రత అంశాన్ని మరింత బలపరిచేందుకు పోలీసు శాఖ అన్ని జిల్లాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలాం, జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలింగ్ కేంద్రాల వ‌ద్ద పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. పోలీసు అధికారులు వ్యక్తిగతంగా కేంద్రాలను సందర్శించి భద్రత, జనసంచారం, క్యూలైన్ల నిర్వహణ వంటి అంశాలను సమీక్షించారు.

జిల్లాల వారీగా పోలింగ్ వివ‌రాలు

తొలి విడతలో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన మొత్తం 22 మండలాల్లో పోలింగ్ జ‌రిగింది. కరీంనగర్ జిల్లాలో తొలి విడతలో 5 మండలాలు అయిన‌ చొప్పదండి, గంగాధర, కరీంనగర్ రూరల్, కొఠపల్లి రామడుగులో ఓటింగ్ నిర్వహించబడింది. మొత్తం 1,52,408 మంది ఓటర్లలో 1,24,088 మంది ఓటును వినియోగించుకున్నారు. పోలింగ్ 81.42%గా న‌మోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా పోలింగ్ నమోదైన జిల్లాల్లో కరీంనగర్ ముందంజలో నిలిచింది. మహిళలు ఇక్కడ కూడా పురుషుల కంటే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించారు.

జ‌గిత్యాల జిల్లా

జగిత్యాల జిల్లాలో తొలి విడతలో 7 మండలాలైన భీమారాం, ఇబ్రాహింపట్నం, కాతలాపూర్, కొరుట్ల, మల్లాపూర్, మెడిపల్లి, మెట్‌పల్లిలో పోలింగ్ జరిగింది. మొత్తం 2,18,194 మంది ఓటర్లలో 1,69,486 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 77.68% న‌మోదు కాగా మహిళలు పురుషుల కంటే ఎక్కువ సంఖ్యలో ఓటు వేయడం ఈ జిల్లాలో ప్రత్యేకంగా నిలిచింది.

పెద్ద‌ప‌లి జిల్లా

పెద్దపల్లి జిల్లాలో తొలి విడతలో 5 మండలాలైన శ్రీరాంపూర్, కామేపూర్, రామగిరి, మంథని, ముత్తారంలో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం 1,43,856 మంది ఓటర్లలో 1,18,346 మంది ఓటు వేయగా జిల్లాలో పోలింగ్ శాతం 82.27% గా నమోదైంది. ముఖ్యంగా మంథని, కామేపూర్ మండలాల్లో ఉదయం నుంచే ఓటర్ల రద్దీ అధికంగా కనిపించింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి విడతలో 5 మండలాల్లో చందుర్తి, కొనరాయిపేట్, రుద్రంగి, వేములవాడ, వేములవాడ రూరల్ పోలింగ్ జరిగింది. మొత్తం 1,11,148 మంది ఓటర్లలో 87,339 మంది ఓటు వేసి 76.58% పోలింగ్ శాతాన్ని నమోదు చేశారు. వేములవాడ, కొనరాయిపేట్ మండలాల్లో పోలింగ్ శాతం ఇతర మండలాల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. మొత్తం 4 జిల్లాలో క‌ల‌పి 6,25,606 మంది ఓటర్లలో 4,99,259 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో తొలి విడత ఎన్నికల్లో సగటు పోలింగ్ శాతం 79.77% గా నమోదైంది. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద అధికారుల నిరంతర పర్యవేక్షణ, పోలీస్ బందోబస్తు ప్రభావం స్పష్టంగా కనిపించింది. మొత్తం పోలింగ్ ప్రక్రియలో ఎక్కడా అనుచిత పరిణామాలు చోటు చేసుకోకుండానే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విడత పోలింగ్ పూర్తిస్థాయిలో ప్ర‌శాంతంగా ముగిసింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img