epaper
Saturday, March 28, 2026
epaper

పారిశుధ్య కార్మికులపై పెత్తనం

పారిశుధ్య కార్మికులపై పెత్తనం
ఎస్సై దౌర్జన్యం బహిర్గతం!
కార్మికులపై బెదిరింపులు, బూతు దండ‌కం
సెలవులు ఇవ్వకుండా వేధింపులు
డ్రైవర్లు, కార్మికుల జీతాల్లో అడ్డ‌గోలుగా కోత‌లు
9 నుంచి 23 డివిజన్లలో కార్మికుల అరిగోస
రాజకీయ అండతో ఇష్టారాజ్యం ఆరోపణలు
నగరపాలక సంస్థలో పారిశుధ్య వ్యవస్థపై ప్రశ్నలు

కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరపాలక సంస్థలో పారిశుధ్య కార్మికులపై ఒక పారిశుధ్య ఎస్సై పెత్తనం చలాయిస్తున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రోజూ నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు కష్టపడుతున్న కార్మికులనే లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెలవులు ఇవ్వకుండా బెదిరించడం, బూతులు తిట్టడం, జీతాల్లో కోతలు విధించడం వంటి చర్యలతో కార్మికులు మానసికంగా కుంగిపోతున్నారని సమాచారం. నగరపాలక సంస్థలో పారిశుధ్య పనుల నిర్వహణ కోసం డివిజన్లను సెక్టార్లుగా విభజించి ఎస్సైలకు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో, కొందరు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 9వ డివిజన్ నుంచి 23వ డివిజన్ వరకు పని చేస్తున్న కార్మికులు ఒకే ఎస్సై చేత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.

సెలవులు అడిగితే శిక్షలా…

అనారోగ్యం కారణంగా సెలవులు కోరిన కార్మికులను వదలకుండా మరింత ఒత్తిడి పెడుతున్నారని బాధితులు చెబుతున్నారు. సెలవు ఇవ్వనని స్పష్టం చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరిని అసభ్య పదజాలంతో దూషించడం కూడా జరుగుతోందని పేర్కొంటున్నారు. రోజంతా కష్టపడి పనిచేసిన తర్వాత నెలాఖరులో జీతం కోసం ఎదురుచూసే కార్మికులపై అనవసర కోతలు విధించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. చిన్న చిన్న కారణాలతో వేతనాల్లో కోతలు పెట్టి జీవనోపాధిపై ప్రభావం చూపుతున్నారని కార్మికులు అంటున్నారు.

రాజకీయ అండతో నిరంకుశ ధోరణి

సదరు ఎస్సై వెనుక రాజకీయ నాయకుల అండ ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. కుటుంబ సంబంధాలు, రాజకీయ పరిచయాలను ఉపయోగించుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి కూడా వెనుకడుగు వేస్తున్నారని సమాచారం. మమత రోడ్డు, మధురానగర్, శ్రీరామ్ నగర్, పులిపాటి కాలనీ, గొల్లగూడెం ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. తమ సమస్యలు చెప్పుకునే స్థితి లేకపోవడంతో లోలోపలే మానసికంగా బాధపడుతున్నారని చెబుతున్నారు.
మొత్తంగా ఖమ్మం నగరపాలక సంస్థలో పారిశుధ్య విభాగం పనితీరుపై ఈ ఘటన ప్రశ్నలు లేవనెత్తుతోంది. నగరాన్ని శుభ్రంగా ఉంచే కార్మికులే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం దురదృష్టకరం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

క‌ల్యాణ వైభోగం

క‌ల్యాణ వైభోగం వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం మిథిలా మైదానంలో అభిజిత్ లగ్నంలో అట్టహాసంగా వేడుక‌ జైశ్రీరామ్...

ఎమ్మార్వోల‌కు స్థాన చ‌ల‌నం

ఎమ్మార్వోల‌కు స్థాన చ‌ల‌నం ఒకేసారి 10మంది అధికారుల బ‌దిలీలు సాధార‌ణ బ‌దిలీలే అయినా.. క‌నిపించిన...

గోదావరిలో డీసిల్టింగ్ పేరుతో దోపిడీ!

గోదావరిలో డీసిల్టింగ్ పేరుతో దోపిడీ! సీత‌మ్మ సాగ‌ర్ నిలిపివేయాల‌ని ఎన్జీటీ ఆదేశాలు ఎన్జీటీ ఆదేశాల‌ను...

సమస్య చిన్నదే.. నిర్లక్ష్యమే పెద్దది

సమస్య చిన్నదే.. నిర్లక్ష్యమే పెద్దది పైప్ లైన్ మరమ్మతుల్లో ఆలస్యం పై ప్రజల...

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి కాకతీయ , కూసుమంచి : కూసుమంచి మండలంలో...

మొక్కజొన్న కొనుగోళ్లపై పరిమితిని ఎత్తివేయాలి

మొక్కజొన్న కొనుగోళ్లపై పరిమితిని ఎత్తివేయాలి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జ‌ర‌గాలి అకాల వర్షాల...

రామయ్య సేవలో పోతిరెడ్డికి కీలక బాధ్యత

రామయ్య సేవలో పోతిరెడ్డికి కీలక బాధ్యత ఉత్సవ కమిటీలో స్థానం క‌ల్పించిన ప్ర‌భుత్వం భద్రాచలం...

వరి, మొక్కజొన్న రైతులకు మ‌ద్ధ‌తు ధ‌ర క‌ల్పించాలి

వరి, మొక్కజొన్న రైతులకు మ‌ద్ధ‌తు ధ‌ర క‌ల్పించాలి సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img