epaper
Thursday, January 15, 2026
epaper

“ప్రజలను నట్టేట ముంచేందుకే బీఆర్‌ఎస్ పుట్టింది”

“ప్రజలను నట్టేట ముంచేందుకే బీఆర్‌ఎస్ పుట్టింది”
చింతకుంట విజయరమణ

300 కోట్లు ఖర్చు చేసి కట్టిన చెక్‌డ్యాంలు మూనాళ్ల ముచ్చట
ఎనిమిదింటిలోనూ నాణ్యత జీరో

కాకతీయ, కరీంనగర్ : బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన చెక్‌డ్యాంలన్నీ నాణ్యత లోపాలతో వరుసగా కూలిపోతున్న నేపథ్యంలో, ప్రజలను మోసగించేందుకు మాత్రమే ఆ పార్టీ పనిచేసిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ తీవ్రంగా విమర్శించారు. కరీంనగర్ ఆర్&బీ గెస్ట్‌హౌస్‌లో బుధవారం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రణవ్, ఆరేపల్లి మోహన్ తదితర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరీంనగర్ నుండి మంథని, ముత్తారం వరకు కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఎనిమిది చెక్‌డ్యాంలు నాణ్యత లేక వరుసగా కూలిపోతున్నప్పటికీ బీఆర్‌ఎస్ నాయకులు అబద్ధప్రచారాల్లో మునిగిపోయారని విమర్శించారు. మలహర్, శ్రీరాంపూర్, ముత్తారం, ఓదెల, సుల్తానాబాద్, కరీంనగర్ వరకు నిర్మించిన చెక్‌డ్యాంలు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూపొందించిన డిజైన్‌ ఆధారంగానే నిర్మించబడ్డాయని, అవే ఇప్పుడు వరదలకు తట్టుకోలేక వర్షాకాలాల్లో ధ్వంసమవుతున్నాయని చెప్పారు.జమ్మికుంట సమీపంలో గుంపుల,తనుగుల మధ్య 2020లోనే ఒక చెక్‌డ్యామ్ కూలిపోయినప్పుడు నీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావే ఉన్నారని గుర్తుచేశారు. రైతుల ప్రయోజనాల కోసం కాకుండా ఇసుక మాఫియా కోసం చెక్‌డ్యాంలు కట్టించుకున్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని తీవ్రంగా ఎద్దేవా చేశారు. శ్రీరాంపూర్ మండలంలోని మిర్జాంపేట, రూపునారాయణపేట, వీణవంక, మడక, మల్లారెడ్డిపల్లి, గట్టేపల్లి, నీరుకుల్ల, ఖమ్మంపల్లి ప్రాంతాల్లో నిర్మించిన చెక్‌డ్యాంలు కూడా వరుసగా కూలిపోయాయని వివరించారు.సిరిసిల్లలో దళితులపై దాడులు చేసి ఇసుక దోపిడీ చేసినది బీఆర్‌ఎస్ నేతల కుటుంబమేనని ఆరోపించారు. కాలేశ్వరం అద్భుతమని చెప్పుకునే వారు టూరిజం ప్లాంట్ అంటూ నిర్మించిన నిర్మాణాలు కూడా ఇప్పుడు కూలిపోయాయని విమర్శించారు. చెక్‌డ్యాంలు పేల్చేశారన్న ఆరోపణలను నిరూపిస్తే ఏది చెప్పినా సిద్ధమని, నిరూపించలేకపోతే హరీష్ రావు రాజకీయాలకు దూరమయ్యే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు.తాను ఎమ్మెల్యేగా ఉన్న 2009–14 మధ్య గంగారంలో 14 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యామ్ ఎన్నిసార్లు వరదలు వచ్చినా ఏ మాత్రం దెబ్బతినలేదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదని, రానున్న రోజుల్లో ప్రజలు వారి పాలనకు గట్టి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ఈ సమావేశంలో ఆరేపల్లి మోహన్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రణవ్, అన్నయ్య గౌడ్, మినుపల ప్రకాశ్ రావు, కర్ర రాజశేఖర్, ఆకుల నర్సన్న, గోపగాని సరయ్య గౌడ్, మూల ప్రేమ్ సాగర్, ఆళ్ల సుమన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img