epaper
Monday, March 2, 2026
epaper

ఎరువుల సంక్షోభంపై బీఆర్ఎస్ వినూత్న నిరసన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా నెలకున్న ఎరువుల కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గన్ పార్క్ వద్ద మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోకుండా అసెంబ్లీని తమకు అనుకూలంగా నడిపిస్తుందని ఆరోపించారు.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులపాటు జరగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏ అంశాన్నైనా సభలో పెట్టినా, తాము సమాధానం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు. వ్యవసాయం నుంచి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వరకు ఏ విషయానికైనా సమాధానం ఇవ్వడానికి తాము వెనకడుగు వేయమని అన్నారు.

డిస్క్వాలిఫై అయిన ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తామని కేటీఆర్ తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీని తనకు అనుకూలంగా నడిపించడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.

రైతుల సమస్యలపై మాట్లాడకుండా, ముఖ్యంగా ఎరువుల కొరతపై దృష్టి పెట్టకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. “బీఆర్‌ఎస్ పాలనలో పది సంవత్సరాలు ఎప్పుడూ రైతులు లైన్లలో నిలబడి ఎరువుల కోసం ఇబ్బంది పడలేదు. కానీ ఇప్పుడు రైతులు ఆధార్ కార్డులు, చెప్పులు లైన్లో పెట్టి వర్షంలోనూ నిలబడాల్సి వస్తోంది” అని ఆయన ప్రశ్నించారు.

భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతుల పరిస్థితి దారుణంగా మారిందని, ఇప్పటికే 600 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 75 లక్షల మంది రైతులు ఈరోజు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ సమస్యలపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

అదేవిధంగా, కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 వాగ్దానాల అమలులో వైఫల్యం, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వంటి అంశాలపై కూడా చర్చ జరగాలని కేటీఆర్ అన్నారు. ప్రజల సమస్యలను పక్కనబెట్టి, తమకు అనుకూలమైన రెండు మూడు విషయాలపైనే కాంగ్రెస్ మాట్లాడుతోందని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సహా అన్ని అంశాలపై సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. “అది పీసీ గోష్ కమిషన్ కాదు, కాంగ్రెస్ పార్టీ వేసుకున్న పీసీసీ గోష్ కమిషన్ మాత్రమే” అంటూ ఆయన ఎగతాళి చేశారు. ఈ నిరసనతో బీఆర్‌ఎస్ రైతుల సమస్యలను మరింతగా ప్రాధాన్యం చేకూర్చుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img