మున్సిపల్ ఫలితాల్లో బీఆర్ఎస్ జోరు
వివిధ మున్సిపాలిటీల్లో ఎనిమిది వార్డుల్లో విజయం
ఇబ్రహీంపట్నం, రామాయంపేట, అలియాబాద్, గడ్డపోతారంలో ఆధిక్యం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పలు చోట్ల విజయం సాధిస్తూ జోరు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు వివిధ మున్సిపాలిటీల్లో మొత్తం ఎనిమిది మంది బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ కుమార్ 100 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అదే మున్సిపాలిటీలోని 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు శ్రీలత గెలుపొందారు. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలోని 19వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గురుక కుమార్ విజయం సాధించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దెల మాధవి 39 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో నాలుగు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. ఇతర వార్డుల ఫలితాలు క్రమంగా వెలువడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల మధ్య పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. పూర్తి ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


