epaper
Sunday, March 1, 2026
epaper

బ‌ల్దియాపై బీఆర్ఎస్ ఫోక‌స్‌

బ‌ల్దియాపై బీఆర్ఎస్ ఫోక‌స్‌

గేర్ మార్చ‌నున్న కారు పార్టీ

వ‌రుస ప‌రాజ‌యాల‌తో కేడ‌ర్ డీలా

ఉప ఎన్నిక‌ల్లోనూ నిరాశప‌ర్చిన ఫ‌లితాలు

సెంటిమెంట్ కూడా వ‌ర్కౌట్ కాని ప‌రిస్థితి

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న పార్టీ

వ‌రుసగా రెండు ప‌ర్యాయాలు మేయ‌ర్ పీఠం

ఈసారి ఎలాగైనా ద‌క్కించుకోవాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌

గ్రేట‌ర్ హైద‌రాబాద్ నేత‌ల‌తో కేటీఆర్ భేటీ

ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సిద్ధంగా ఉండాలని పిలుపు

కార్పొరేట‌ర్లు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు దిశానిర్దేశం

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై భారత రాష్ట్ర సమితి ఫోకస్ పెట్టింది. జూబ్లీహిల్స్ ఓట‌మితో ర‌గిలిపోతున్న పార్టీ ఎలాగైనా జీహెచ్ఎంసీపై గులాబీ జెండా ఎగుర‌వేయాల‌న్న గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్ప‌టి నుంచే రాబోయే ఎన్నికలకు వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ గ్రేట‌ర్ హైద‌రాబాద్‌కు చెందిన ముఖ్య నేత‌ల‌తో తెలంగాణ భ‌వ‌న్‌లో స‌మావేశం నిర్వ‌హించారు. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా దిశానిర్దేశం చేశారు. ఈ మీటింగ్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజ‌ర‌య్యారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ కార్యకలాపాలు, జీహెచ్ఎంసీలోని సమస్యల మీద పోరాటాలు, ఎన్నిక‌ల‌ల్లో గెలుపు వంటి.. అంశాల‌పై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

వ‌రుస‌గా రెండు ప‌ర్యాయాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ విజ‌యం సాధించింది. తొలి గ్రేట‌ర్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఏకంగా 99 సీట్లు దక్కించుకొని గులాబీ పార్టీ సంచలనం సృష్టించింది. కాగా 2020లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కొంత వెనుక‌బ‌డింది. పార్టీ బలం 65 స్థానాలకు తగ్గింది. అదే సమయంలో బీజేపీ బలం 42 స్థానాలకు పెరిగింది. ఎంఐఎం పార్టీ కూడా 42 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు 2023 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గ్రామీణ ప్రాంత ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. అదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు ఈ పార్టీకి మెజారిటీ స్థానాలు కట్టబెట్టారు.

వ‌రుస ప‌రాయ‌జ‌యాలు

కానీ ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ప్రజలు తిర‌స్క‌రించారు. ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా కట్టబెట్టలేదు ప్రజలు. అటు రాజ‌ధానిలోని కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీ సిట్టింగ్ స్థానాల్లో ఓడిపోయింది. ఎమ్మెల్యేలు చనిపోయిన సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాలేదు. అటు మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది. అందుకే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటి హైదరాబాద్ నగరంలో మ‌రోమారు పట్టు నిలుపుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అందుకు ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలను ముమ్మురం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ రోజు తన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నైరాశ్యంలో కూరుకుపోయిన పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపనున్నారు.

ప‌దేళ్లు అద్బుతంగా ప‌నిచేశాం

గ్రేటర్‌ హైదరాబాద్‌ నేతలతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమావేశమయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులతో తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు. మంగళవారం జరుగనున్న గ్రేటర్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం, జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సన్నద్ధతపై చర్చించారు. ఈసందర్భంగా కార్పొరేటర్లకు వివిధ అంశాలపై కేటీఆర్‌ మార్గదర్శనం చేశారు. పది సంవత్సరాలపాటు అధికారంలో ఉండి ఎలాంటి అవినీతికి తావు లేకుండా అద్భుతంగా పదవీకాలం పూర్తి చేసుకోబోతున్నారని పార్టీ తరపున వారికి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా రెండోసారి జీహెచ్ఎంసీలో గెలిచిన తర్వాత కరోనా వంటి తీవ్ర సంక్షోభంలోనూ అద్భుతమైన సేవలను అందించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రజలు పార్టీకి ప్రతిపక్షంగా బాధ్యత ఇచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఉన్న కార్పొరేటర్లు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేసిన తీరును అభినందించారు.

ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉండాలి

పార్టీ వెంటే నిలబడిన ప్రతి ఒక్క కార్పొరేటర్‌కి భవిష్యత్తులో మరిన్ని పదవులు వస్తాయని కేటీఆర్ హామీ ఇచ్చారు. కార్పొరేటర్లు భవిష్యత్తులో జరిగే ఎన్నికను తమ ఎన్నికగా తీసుకొని పార్టీ అందరినీ తిరిగి గెలిపించుకుంటుందని భరోసా ఇచ్చారు. కార్పొరేటర్లకి రానున్న కాలంలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సిద్ధంగా ఉండాలని సూచించారు. కౌన్సిల్‌ సమావేశంలో బల్దియాలోని సమస్యలు ప్రస్తావించాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పారిశ్రామిక భూముల అమ్మకంపై నిలదీయాలని సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img