epaper
Wednesday, March 11, 2026
epaper

క‌రీంనగర్ మేయర్ పీఠమే బీజేపీ లక్ష్యం

క‌రీంనగర్ మేయర్ పీఠమే బీజేపీ లక్ష్యం
కార్పొరేషన్ ఎన్నికలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి
టికెట్ల కేటాయింపులో పార్టీ నిర్ణయమే ఫైనల్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈసారి కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ ఎన్నికలు తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించే కీలక పోరుగా మారుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని, కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చేవారందరికీ స్వాగతం పలుకుతామని, కలిసికట్టుగా పనిచేసి కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరవేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

పార్టీ నిర్ణయమే ఫైనల్

శుక్రవారం కరీంనగర్‌లోని ఈఎన్ గార్డెన్స్‌లో నిర్వహించిన బీజేపీ నేతల సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 24వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణరెడ్డి, 56వ డివిజన్ మాజీ కార్పొరేటర్ తాటి ప్రభావతి తమ అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి బండి సంజయ్ స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బీజేపీలో పార్టీ నిర్ణయమే అంతిమమని, పార్టీ కంటే వ్యక్తులు ఎవరూ పెద్దవాళ్లు కాదని స్పష్టం చేశారు. గతంలో ఇద్దరు ఎంపీలకే పరిమితమైన బీజేపీ నేడు వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలో కొనసాగుతోందని గుర్తుచేశారు. దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలతో దేశాన్ని వెనక్కి నెట్టిందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోందన్నారు.

కరీంనగర్‌పై ప్రత్యేక ఫోకస్

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయని బండి సంజయ్ తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాలకే పరిమితమైందని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కరీంనగర్ జిల్లాను కేంద్రంగా చేసుకుని ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర విజయానికి కరీంనగర్ కార్యకర్తల పాత్ర కీలకమని, వారి సహకారంతోనే తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంటుందా లేదా అన్న అంశంపై రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోందన్నారు. మేయర్ సీటును గెలుచుకోవడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కసితో పని చేయాలని పిలుపునిచ్చారు.

టికెట్ల కోసం భారీ పోటీ
ఈసారి కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ల కోసం ఎప్పుడూ లేనంతగా పోటీ నెలకొందని బండి సంజయ్ వెల్లడించారు. ఒక్కో డివిజన్‌కు 20 మందికిపైగా ఆశావహులు ఉన్నారని తెలిపారు. గెలిచే అవకాశమున్న డివిజన్లలో పాత కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తామని, గెలుపు అవకాశాలు లేని చోట ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తామని చెప్పారు. టికెట్ల కేటాయింపు పూర్తిగా వివిధ సర్వే నివేదికల ఆధారంగానే జరుగుతుందని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే టికెట్లు ఖాయం కాదని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులంతా క్రమశిక్షణతో ఐక్యంగా పనిచేస్తే కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మున్సిపల్ చైర్మన్‌కు సత్కారం

మున్సిపల్ చైర్మన్‌కు సత్కారం కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మండల కేంద్రంలోని...

ఆఫీస్‌లు పరిశుభ్రంగా ఉండాలి

ఆఫీస్‌లు పరిశుభ్రంగా ఉండాలి రికార్డులు, ఫైళ్లు నిబంధనల ప్రకారం భద్రపరచాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్ కలెక్టరేట్...

దళిత బంధు సమితి సభ్యుల అరెస్ట్

దళిత బంధు సమితి సభ్యుల అరెస్ట్ కాకతీయ, జమ్మికుంట: హుజురాబాద్ నియోజకవర్గంలో మంత్రి...

సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం

సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం కాకతీయ, హుజురాబాద్: పట్టణంలోని జ్యోతిబాపూలే కూడలిలో సావిత్రిబాయి...

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం -భవిష్యత్తులో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక...

142 పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు..

142 పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు.. కాకతీయ,శంకరపట్నం: మండలంలోని మొలంగూర్, నల్లా వెంకయ్యపల్లి...

కవిత అరెస్ట్‌పై తెలంగాణ జాగృతి ఆగ్రహం

కవిత అరెస్ట్‌పై తెలంగాణ జాగృతి ఆగ్రహం కాకతీయ, కరీంనగర్: ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల...

భగత్ నగర్ ప్రజల ప్రేమే నా బలం

భగత్ నగర్ ప్రజల ప్రేమే నా బలం డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img