epaper
Friday, January 23, 2026
epaper

క‌రీంనగర్ మేయర్ పీఠమే బీజేపీ లక్ష్యం

క‌రీంనగర్ మేయర్ పీఠమే బీజేపీ లక్ష్యం
కార్పొరేషన్ ఎన్నికలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి
టికెట్ల కేటాయింపులో పార్టీ నిర్ణయమే ఫైనల్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈసారి కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ ఎన్నికలు తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించే కీలక పోరుగా మారుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని, కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చేవారందరికీ స్వాగతం పలుకుతామని, కలిసికట్టుగా పనిచేసి కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరవేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

పార్టీ నిర్ణయమే ఫైనల్

శుక్రవారం కరీంనగర్‌లోని ఈఎన్ గార్డెన్స్‌లో నిర్వహించిన బీజేపీ నేతల సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 24వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణరెడ్డి, 56వ డివిజన్ మాజీ కార్పొరేటర్ తాటి ప్రభావతి తమ అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి బండి సంజయ్ స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బీజేపీలో పార్టీ నిర్ణయమే అంతిమమని, పార్టీ కంటే వ్యక్తులు ఎవరూ పెద్దవాళ్లు కాదని స్పష్టం చేశారు. గతంలో ఇద్దరు ఎంపీలకే పరిమితమైన బీజేపీ నేడు వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలో కొనసాగుతోందని గుర్తుచేశారు. దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలతో దేశాన్ని వెనక్కి నెట్టిందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోందన్నారు.

కరీంనగర్‌పై ప్రత్యేక ఫోకస్

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయని బండి సంజయ్ తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాలకే పరిమితమైందని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కరీంనగర్ జిల్లాను కేంద్రంగా చేసుకుని ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర విజయానికి కరీంనగర్ కార్యకర్తల పాత్ర కీలకమని, వారి సహకారంతోనే తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంటుందా లేదా అన్న అంశంపై రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోందన్నారు. మేయర్ సీటును గెలుచుకోవడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కసితో పని చేయాలని పిలుపునిచ్చారు.

టికెట్ల కోసం భారీ పోటీ
ఈసారి కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ల కోసం ఎప్పుడూ లేనంతగా పోటీ నెలకొందని బండి సంజయ్ వెల్లడించారు. ఒక్కో డివిజన్‌కు 20 మందికిపైగా ఆశావహులు ఉన్నారని తెలిపారు. గెలిచే అవకాశమున్న డివిజన్లలో పాత కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తామని, గెలుపు అవకాశాలు లేని చోట ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తామని చెప్పారు. టికెట్ల కేటాయింపు పూర్తిగా వివిధ సర్వే నివేదికల ఆధారంగానే జరుగుతుందని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే టికెట్లు ఖాయం కాదని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులంతా క్రమశిక్షణతో ఐక్యంగా పనిచేస్తే కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యువ ప్రతిభకు టీజీఐసీ బలం

యువ ప్రతిభకు టీజీఐసీ బలం కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : యువతలోని...

ప్రజాసేవే లక్ష్యంగా కాంగ్రెస్‌లోకి డాక్టర్ సూరంజన్

ప్రజాసేవే లక్ష్యంగా కాంగ్రెస్‌లోకి డాక్టర్ సూరంజన్ నిరుపేదల వైద్యుడిగా గుర్తింపు పొందిన ప్రముఖుడి...

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి స్వచ్ఛ సర్వేక్షన్‌లో టాప్ ర్యాంక్ లక్ష్యం వివిధ స్కీముల...

కరీంనగర్ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే

కరీంనగర్ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలి బీఆర్ఎస్–బీజేపీలకు ఓటు...

మున్సిపల్ ఎన్నికల బరిలో ఫార్వర్డ్ బ్లాక్

మున్సిపల్ ఎన్నికల బరిలో ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుతో అన్ని చోట్ల పోటీ...

ఇసుక ర్యాంపుల్లో యథేచ్ఛగా అక్రమ వసూళ్లు

వసూళ్లు షూరు ఇసుక ర్యాంపుల్లో యథేచ్ఛగా అక్రమ వసూళ్లు ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్ లోడింగ్ చార్జీల...

పార్టీలు మారడంతో కాంగ్రెస్‌కు నష్టం లేదు

పార్టీలు మారడంతో కాంగ్రెస్‌కు నష్టం లేదు మంత్రి వివేక్‌పై విమర్శలకు అర్హత లేదన్న...

సర్వాంగ సుందరంగా శ్రీ మహాశక్తి దేవాలయం

సర్వాంగ సుందరంగా శ్రీ మహాశక్తి దేవాలయం కాకతీయ, కరీంనగర్: కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img