epaper
Thursday, January 15, 2026
epaper

కాంగ్రెస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఆరోపణలు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఫైర్

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై నెపం నెడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే 2018 పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 285ను సవరించాల్సిన అవసరం ఉందని, దీనిని బీజేపీ ఇప్పటికే స్పష్టంగా చెప్పిందని రాంచందర్ రావు గుర్తుచేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేకపోవడం వల్ల 22 నెలల పాటు ఆలస్యం జరిగిందని, చివరికి బీజేపీ సూచించిన మార్గాన్ని అనుసరించి బిల్లు తీసుకువచ్చిందని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లపై నిజాయితీగా ఉంటే, మొదట అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్‌కి పంపించి ఉండాల్సి ఉందని రాంచందర్ రావు అన్నారు. కానీ, కాంగ్రెస్ తప్పుడు ప్రచారంతో బీసీలను తప్పుదారి పట్టించిందని విమర్శించారు. కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభ అసలైన ద్రోహ సభ అని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవడం వల్ల 73వ, 74వ సవరణల ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ.3,000 కోట్ల నిధులు తెలంగాణకు రాకుండా పోయాయని ఆయన వెల్లడించారు. ఇది కాంగ్రెస్ వైఫల్యం కారణంగా రాష్ట్రానికి జరిగిన పెద్ద నష్టం అని అన్నారు.

ఇక బీసీల పట్ల బీజేపీ కట్టుబాటు ఉన్నదని, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఓబీసీ వర్గానికి చెందినవారని, కేంద్ర కేబినెట్‌లో 27 మంది బీసీలను చేర్చడం, బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత ఇవ్వడం వంటి నిర్ణయాలు దీనికి నిదర్శనమని రాంచందర్ రావు గుర్తుచేశారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ తమ కేబినెట్‌లో బీసీలకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. బీసీల హక్కులను కాపాడాలంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు.

అదే సమయంలో, ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని రాంచందర్ రావు చెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..?

మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..? నిర్ణయాధికారాలు ఎవరివి..? ముస్లిం మహిళలు మీ...

సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు!

సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు! డీలిమిటేషన్ పేరుతో కుట్ర కార్పొరేషన్‌తో పాటు జిల్లా ఏర్పాటు చేయాలి హైద‌రాబాద్‌ను...

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం దేవాలయాలపై దాడులు యాదృచ్ఛికం కావు కాంగ్రెస్ పాలనలో ‘అప్పీజ్‌మెంట్’...

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img