epaper
Monday, March 2, 2026
epaper

ఆ సీటు కోసం బీజేపీ–జేడీయూ భారీ ఫైట్..

ఆ సీటు కోసం బీజేపీ–జేడీయూ భారీ ఫైట్..
హీటెక్కిన బీహార్ పాలిటిక్స్!
బీహార్ ఎన్డీయేలో అంతర్గత యుద్ధం
స్పీకర్ పీఠంపై ఏర్పడిన క్లిష్ట పరిస్థితి
ఢిల్లీ వేదిక‌గా కీల‌క స‌మావేశాలు

కాక‌తీయ‌, జాతీయం : బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మి ఘ‌న విజ‌యం సాధించింది. అఖండ మెజారిటీతో కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు కూటమి వర్గాలు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి. ఎన్నికల్లో ఎన్డీయే గెలుపు ఘనంగా కనిపించినా, ప్రభుత్వ నిర్మాణం నేపథ్యంలో కూటమిలో రాజకీయ లెక్కలు, శక్తి ప్రదర్శనలు మొదలయ్యాయి. నితీశ్ కుమార్‌ నాయకత్వాన్ని బీజేపీ అంగీకరించినా… కీలక పదవులు, మంత్రిత్వ శాఖల పంపకంలో రాజకీయ ఆధిపత్య యుద్ధం స్పష్టంగా కనిపిస్తోంది.

కొత్త మంత్రివర్గ కూర్పుపై బీజేపీ–జేడీయూ మధ్య అంతర్గత చర్చలు వేగంగా కొనసాగుతున్నాయి. ఏ పార్టీకి ఏ శాఖ ఇవ్వాలి? ఎవరు మంత్రులు కావాలి? అన్న విషయాలపై ఇప్పటికే ఫార్ములా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇదే త‌రుణంలో అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం బీజేపీ, జేడీయూ పార్టీలు పోటీ ప‌డుతున్నాయి. ఎన్‌డిఎలో సంఖ్యాబలం బీజేపీకే ఎక్కువ‌. కానీ సీఎం కుర్చీ జేడీయూకి వెళ్లడంతో స్పీకర్ పదవిని ఖచ్చితంగా త‌మకే బీజేపీ ప‌ట్టుప‌డుతోంద‌ట‌. గత అసెంబ్లీలో స్పీకర్‌గా బీజేపీకి చెందిన నంద కిశోర్ యాదవ్, డిప్యూటీ స్పీకర్‌గా జేడీయూ నేత నరేంద్ర నారాయణ్ యాదవ్ పనిచేశారు. ఈసారి కూడా అదే ఫార్ములాను కొనసాగించాలనేది బీజేపీ భావిస్తోంది. అయితే ఈసారి స్పీకర్ పదవి తమకే రావాలి అని పట్టుబడుతోంది జేడీయూ. దీంతో స్పీక‌ర్ సీటు కోసం ఇరు పార్టీల మ‌ధ్య భారీ ఫైట్ నెల‌కొంది.

ఈ వివాదం పరిష్కారం కోసం జేడీయూ నేత నితీశ్ కుమార్ ఈరోజు ఢిల్లీలో బీజేపీ టాప్ లీడర్లతో కీలక చర్చలు జరపనున్నారు. మంత్రివర్గంలో ఏ శాఖ ఎవరికన్న దానికంటే.. ఈ సమావేశంలో స్పీకర్ పోస్టే ప్రధాన చర్చ అంశం కానున్నట్లు జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. జేడీయూ సీనియర్ నాయకులు సంజయ్ కుమార్ ఝా, లాలన్ సింగ్ సహా పలువురు ఢిల్లీలో జరిగే చర్చల్లో పాల్గొనడానికి ప్రయాణం అయ్యారు. స్పీకర్ సీటు కోసం బీజేపీపై ఒత్తిడి చేయాలని వారు భావిస్తున్నట్లు సమాచారం.

బీహార్ శాసనసభలో కీలక పదవి కావడంతో బీజేపీ కూడా గ‌ట్టి ప‌ట్టు మీద ఉంది. ఇప్ప‌టికే రాష్ట్ర బీజేపీ నేతలు పాట్నాలో అర్థరాత్రి వరకు వ్యూహాత్మక చర్చలు జరిపార‌ట‌. స్పీకర్ పదవితో పాటు ప్రముఖ శాఖలను కూడా ఏ పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని కేంద్రాధికారులకు తెలియజేయాలని వారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తానికి స్పీకర్ పదవిపై నెలకొన్న పవర్ గేమ్, లాబీయింగ్, టెన్షన్ బీహార్ పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నాయి. ఎలాగైనా నవంబర్ 20 నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అన్నది ఎన్డీయే లక్ష్యం. అయితే స్పీకర్ పీఠంపై బీజేపీ–జేడీయూ మధ్య ఎవరి మాట నిలుస్తుందో చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img