పేదలకు భారంగా మారిన బిజెపి ప్రభుత్వం
* పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన
కాకతీయ, చేర్యాల: ఇరానపై ఇజ్రాయిల్ అమెరికా చేస్తున్న దాడులు నివారించడానికి భారత ప్రభుత్వం చొరవ చూపాలని, దాడులు వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించడమే కాకుండా పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ రేట్లను తగ్గించాలని లేనిపక్షంలో ప్రజాపోరాటాలకు దిగుతామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ హెచ్చరించారు. గ్యాస్ ధరలు పెంచడం నిరసిస్తూ బుధవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఖాళీ గ్యాస్ సిలిండర్ తో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అందె అశోక్ విలేకరులతో మాట్లాడారు. గ్యాస్ డొమెస్టిక్ సిలిండర్ పై రూ.60, కమర్షియల్ వాటిపై రూ. 140 పెంచారని తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలకు పెను భారంగా మారిన ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం, డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం నేడు వారి సంక్షేమం మంట గలిపాయని విరుచుకుపడ్డారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, మండల సహాయ కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి, మండల కార్యవర్గ సభ్యులు పోనుగోటి శ్రీనివాస్ రెడ్డి, మహిళా సమాఖ్య నాయకురాలు సుంకోజు రజిత, డివిజన్ నాయకులు గూడెపు సుదర్శన్, బూరుగు సత్తయ్య, మల్లం అంజయ్య, గజ్జల సురేందర్, గూడెపు సంతోష, అందె యాదవ్వ, పద్మ, లచ్చవ్వ, రాములు, లచ్చయ్య,తదితరులు పాల్గొన్నారు.


