epaper
Saturday, November 15, 2025
epaper

బిహార్ తుది జాబితాలో మహిళా ఓటర్లే ఎక్కువ..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: బిహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తాజాగా తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం అర్హులైన ఓటర్ల సంఖ్య 7.42 కోట్లకు చేరింది. అయితే ఈసారి ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారిలో మహిళలే ఎక్కువగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తుది జాబితా ప్రకారం పురుష ఓటర్ల సంఖ్య 3.8 శాతం తగ్గి 15.5 లక్షలు తగ్గగా, మహిళా ఓటర్ల సంఖ్య 6.1 శాతం తగ్గి 22.7 లక్షలు తగ్గింది. అంటే పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే ఎక్కువగా తొలగించారు. ఈ పరిస్థితి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బిహార్ రాజకీయాల్లో మహిళా ఓటర్లు ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తారు.

మహిళా ఓటర్ల తొలగింపులో గోపాల్‌గంజ్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ 15.1 శాతం అంటే 1.5 లక్షల మహిళలు జాబితా నుంచి తొలగించారు. జనవరిలో ఇక్కడ మహిళా ఓటర్లు 10.3 లక్షలుగా ఉండగా, తుది జాబితాలో 8.3 లక్షలకు తగ్గారు. రెండో స్థానంలో మధుబని జిల్లా (1.3 లక్షలు), మూడో స్థానంలో పూర్వి చంపారన్ (1.1 లక్షలు) ఉన్నాయి. అలాగే సారణ్, భగల్‌పూర్ జిల్లాల్లో కూడా ఒక్కో లక్ష మహిళలు జాబితా నుంచి తొలగించబడ్డారు. ఆసక్తికరంగా ఈ జిల్లాలు అన్నీ పొరుగు రాష్ట్రాలు లేదా దేశాలకు సరిహద్దుగా ఉన్నాయి.

పురుష ఓటర్లలో కూడా తొలగింపులు జరిగాయి కానీ సంఖ్య మహిళలతో పోలిస్తే తక్కువ. మధుబని జిల్లాలో 95,000 పురుషులు, పాట్నాలో 90,000, సారణ్‌లో 86,000, పూర్వ చంపరన్‌లో 85,000, గోపాల్‌గంజ్‌లో 80,000 మంది పురుష ఓటర్లు జాబితా నుంచి తొలగించారు. మహిళా, పురుష ఓటర్లు ఎక్కువగా తొలగించబడిన ఆరు జిల్లాలు ఉన్నాయి. అవి గోపాల్‌గంజ్, మధుబని, పూర్వి చంపరన్, సారణ్, భగల్‌పూర్, పాట్నా. వీటిలో మొత్తం 59 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత 2020 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో మహాఘట్‌బంధన్ 25 సీట్లు, ఎన్డీయే 34 సీట్లు గెలుచుకున్నాయి.

అయితే గతంలో ఈ నియోజకవర్గాల్లో ఓట్ల తేడా చాలా తక్కువగా ఉంది. ఉదాహరణకు, సీ‌ఎస్‌డీఎస్ సర్వే ప్రకారం 38% మహిళలు ఎన్డీయేకు, 37% మహిళలు మహాఘట్‌బంధన్‌కు ఓటు వేశారు. ఇక పురుష ఓటర్లలో 36% ఎన్డీయేకు, 38% మహాఘట్‌బంధన్‌కు మద్దతిచ్చారు. అంటే కేవలం 11,500 ఓట్ల తేడాతో ఎన్డీయే ఆధిక్యం సాధించింది.ఇప్పుడు లక్షలాదిమంది మహిళా ఓటర్లను తొలగించడం వల్ల రాబోయే ఎన్నికల్లో గణనీయమైన మార్పు రావచ్చని భావిస్తున్నారు.

మహిళల ఓటు కీలకమని గుర్తించిన ప్రధాన పార్టీలు ఇప్పటికే వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల బిహార్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనను ప్రారంభించారు. ఈ పథకం కింద 75 లక్షల మహిళలకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు. ఇది మహిళా ఓటర్లపై ప్రభావం చూపుతుందేమో చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీహార్‌లో ఎన్డీఏ క్లియర్ విక్టరీ.. గెలుపు రహస్యాలివే..!

బీహార్‌లో ఎన్డీఏ క్లియర్ విక్టరీ.. గెలుపు రహస్యాలివే..! కాక‌తీయ‌, జాతీయం: బీహార్ అసెంబ్లీ...

పీకే ప్రాజెక్ట్ బీహార్‌లో క్రాష్..!

పీకే ప్రాజెక్ట్ బీహార్‌లో క్రాష్..! పీకే అంచనాలను తారుమారు చేసిన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్లలో...

డిసెంబర్ 6న ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు.. దేశం వ‌ణికేలా జైష్ కుట్ర!

డిసెంబర్ 6న ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు.. దేశం వ‌ణికేలా జైష్ కుట్ర! ఎర్రకోట...

ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌ గుట్టు రట్టు.. ఇమామ్ ఇర్ఫాన్ అరెస్ట్‌!

ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌ గుట్టు రట్టు.. ఇమామ్ ఇర్ఫాన్ అరెస్ట్‌! ఫరీదాబాద్ మాడ్యూల్...

ఢిల్లీ బ్లాస్ట్‌ కుట్రలో కొత్త మలుపు..

ఢిల్లీ బ్లాస్ట్‌ కుట్రలో కొత్త మలుపు..జనవరి 26న మరో దాడికి ప్లాన్..! దీపావళికే...

ఎన్‌డీఏదే బీహార్… మహాఘట్ బంధన్ పై దాదాపు 8.3 శాతం ఓట్ల ఆధిక్యం

ఎన్‌డీఏదే బీహార్ ప‌నిచేసిన ‘నిమో’ (నితీష్+మోదీ) ఫార్ములా ఎన్డీయే కూటమికి 46.2 శాతం ఓట్లు మహాఘట్...

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్!

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్! కాక‌తీయ‌, జాతీయం : దేశ...

ఢిల్లీ: ఆ భ‌య‌మే బాంబ్ బ్లాస్ట్‌కు కార‌ణ‌మా?

ఢిల్లీ: ఆ భ‌య‌మే బాంబ్ బ్లాస్ట్‌కు కార‌ణ‌మా? కాక‌తీయ‌, జాతీయం : దేశ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img