జీఎస్టీ ఇన్స్పెక్టర్గా భూమా అరవింద్
కాకతీయ,శంకరపట్నం : మండలంలోని గద్ధపాక గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ భూమ సంపత్ వసంత కుమారుడు భూమ అరవింద్ ప్రతిభ చాటుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన గ్రూప్-బి ఉద్యోగాల్లో జిఎస్టీ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అరవింద్ కృషి, పట్టుదలతో ఈ స్థాయి ఉద్యోగాన్ని సాధించడం గ్రామానికి గర్వకారణంగా మారింది. చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి కలిగిన ఆయన, లక్ష్యసాధన కోసం నిరంతరం శ్రమిస్తూ ఈ విజయాన్ని అందుకున్నారు. అరవింద్ సాధించిన ఈ విజయంపై గ్రామస్థులు, స్నేహితులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ, తమ కుమారుడు కష్టపడి చదివి ఈ స్థాయికి చేరడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.


