భక్తులతో కిటకిటలాడిన భీమేశ్వర స్వామి ఆలయం
పూజా కార్యక్రమాల్లో భక్తుల ఉత్సాహం
అన్నపూజలు, హోమాలు, వ్రతాలు నిర్వహణ
కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో ఆదివారం ఉదయం నుంచే భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు, అన్నపూజలు, నిత్య కళ్యాణం, చండీ హోమం, సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. అలాగే కోడెమొక్కులు, కుంకుమ పూజలు సహా వివిధ మొక్కులు స్వామివారికి చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. దర్శనాలు సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకున్నారు.


