మొక్కలను సంరక్షించడంలో బాధ్యతగా వహించాలి
ఎంపీడీవో సింగారపు కుమార్
కాకతీయ, నెల్లికుదురు:నర్సరీలో మొక్కలను సంరక్షించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎంపీడీవో సింగారపు కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని నల్లగుట్ట తండా గ్రామపంచాయతీ లోని నర్సరీలో సర్పంచ్ గుగులోత్ హేమలత ఆధ్వర్యంలో మొక్కల సంరక్షణ పై అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీడీవో కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మొక్కలను సంరక్షించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత గా తీసుకుంటూ మండలంలోని గ్రామపంచాయతీలలో లోని నర్సరీలో మొక్కలను ప్రత్యేక దృష్టితో సమయాన్ని కేటాయించి సంరక్షించే బాధ్యత గ్రామ పాలక మండలి తో సహా సంబంధిత కార్యదర్శులు, వన సేవకులు పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ పద్మ వివిధ గ్రామాల గ్రామ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.


