epaper
Thursday, January 15, 2026
epaper

లిక్కర్ రాణితో ఇందూరుకు చెడ్డపేరు.. టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: కల్వకుంట్ల కవితపై టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లొచ్చిన కవిత నిజామాబాద్ కు చెడ్డ పేరు తీసుకువచ్చిందంటూ ఫైర్ అయ్యారు. ఈనెల 15వ తేదీన కామారెడ్డి వేదికగా జరగనున్న బీసీ రిజర్వేషన్లపై బహిరంగ సభ కోసం సన్నాహక సమావేశం నిర్వహించారు. టీపీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ప్రతిపక్షాల భరతం సాధించడానికి ఈ సభ కీలకమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంలో కట్టుబడి ఉందని, ఈ సభ ద్వారా కేంద్రం స్పందించాల్సిందేనని ఆయన ఆన్నారు.

మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ సభ మోడీ, అమిత్ షా దృష్టికి వచ్చేలా, వారిపై ప్రభావం చూపేలా ఉంటుందని హామీ ఇచ్చారు. బీజేపీ నేతలు “దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్న బిచ్చగాళ్లాగా మారిపోయారు. బండి సంజయ్ ఉదయాన్నే దేవుళ్ల చుట్టూ తిరిగి ఓట్లు అడుగుతారు. బీసీ రిజర్వేషన్లపై వారు దొంగాట ఆడుతున్నారు అని తీవ్రంగా విమర్శించారు.

అంతేకాదు, బీఆర్‌ఎస్‌పై కూడా మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. కవిత నిజామాబాద్‌కు చెడ్డ పేరు తెచ్చారు. కేసీఆర్ కుటుంబం అంతా దోపిడీకి పాల్పడ్డారని, వాటాల పంపకాల్లో తేడాలు రావడం కారణంగా కుటుంబంలో కుమ్ములాటలు జరుగుతున్నాయన్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు.

ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మహేష్ కుమార్ గౌడ్ చివరగా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ సమానత్వానికి మారు పేరు, కుల సర్వేలో 56.33శాతం బీసీలు ఉన్నారని, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img