epaper
Thursday, January 15, 2026
epaper

రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ

రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ
మానేరు చెక్ డ్యాం కూల్పుపై కేంద్ర మంత్రి ఆందోళన

కాకతీయ, కరీంనగర్ : మానేరు నదిపై కట్టిన చెక్ డ్యాంలు కూలిపోయిన ఘటనకు కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసి, చెక్ డ్యాంల నిర్మాణంలో ఏర్పడిన లోపాలు, అవకతవకలు, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నారు.లేఖలో మంత్రి బండి సంజయ్ ప్రస్తావించినట్లుగా, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో మానేరు నదిపై 57 చెక్ డ్యాంలు నిర్మించడంలో రూ.287 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించబడ్డాయి. అయితే, గత బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన ఈ చెక్ డ్యాంలు నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడం, పర్యవేక్షణలో లోపాలు వలన ఈ రోజు పరిస్థితి దారుణంగా మారింది. ముఖ్యంగా తనుగుల-గుంపుల వద్ద చెక్ డ్యాం కూలిపోవడం, ప్రాంతీయ రైతులు ఎదుర్కొంటున్న నష్టం, సమీప పంటలు నష్టపోవడం వంటి సమస్యలను మంత్రి బండి సంజయ్ తీవ్రంగా గుర్తించారు.మంత్రి రాసిన లేఖలో..అవకతవకలకు పాల్పడిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి ఆస్తులను జప్తు చేసి నష్టాన్ని రికవరీ చేయాలని, తద్వారా భవిష్యత్తులో ఎవరికైనా అలాంటి తప్పులు చేయకుండా నిబంధనలు కట్టుబడేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంగా సూచించారు.కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖలో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు, గతంలో బీఆర్ఎస్ పాలనలో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడం, కమీషన్ల పర్యవేక్షణలో లోపం, ప్రజా నిధుల నిష్పక్షపాత వాడకం చెక్ డ్యాంలు కూలిపోవడానికి ప్రధాన కారణమని. అలాగే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇసుక అక్రమ తవ్వాలు, చెక్ డ్యాంల పరిరక్షణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, రెండు ప్రధాన పార్టీల నిర్లక్ష్యం వల్ల రైతులు, ప్రజల పన్ను డబ్బులు వృధా అయ్యాయని లేఖలో పేర్కొన్నారు.బండి సంజయ్ లేఖలో చివరగా పేర్కొనబడింది, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెక్ డ్యాంల నిర్మాణంలో అక్రమాలు, నాసిరకం పనులపై సమగ్ర విచారణ నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని. ఈ ప్రక్రియలో స్వతంత్ర సంస్థలకూ ఆదేశాలు ఇవ్వడం ద్వారా నిర్లక్ష్యం, అవినీతికి చెక్ పెట్టాలని ఆయన సూచించారు.ఈ లేఖ కేంద్ర, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి, చర్చకు కేంద్రబిందువుగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బహిరంగ లేఖపై ఎలాంటి ప్రతిస్పందన ఇస్తారు ఇవ్వారో ఇంకా స్పష్టత లేదు. కేరంనగర్ జిల్లాలోని రైతులు, స్థానికులు ఈ సంఘటనతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img