యోగాతో శరీరం, మనసు, ఆత్మ సమతుల్యత
ఖిలా వరంగల్లో ఘనంగా హోమియోపతి ఆయుష్ దినోత్సవం
వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద
కాకతీయ, ఖిలా వరంగల్ : యోగ సాధన ద్వారా శరీరం, మనసు, ఆత్మ సమతుల్యత సాధించవచ్చని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద తెలిపారు. జీవనశైలి సంబంధిత వ్యాధులను యోగతో నియంత్రించవచ్చని సూచించారు. ప్రజాపాలన ప్రగతి 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆరోగ్య థీమ్ కార్యక్రమంలో శుక్రవారం ఖిలా వరంగల్లో ప్రపంచ హోమియోపతి దినోత్సవం, ఆయుష్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఉదయం స్వయంభూ దేవాలయం వద్ద నిర్వహించిన యోగ ప్రదర్శనలో కలెక్టర్ స్వయంగా యోగాసనాలు చేశారు. యోగతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. డాక్టర్ శామ్యూల్ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఖిలా వరంగల్ ముదిరాజ్ భవన్లో ఏర్పాటు చేసిన ఆయుష్ హెల్త్ క్యాంప్ను ప్రారంభించారు. ఈ శిబిరంలో ఆయుష్ వైద్యులు ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉమా దామోదర్ యాదవ్, భోగి సువర్ణ, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. సాంబశివరావు, జిల్లా ఇన్చార్జ్ ఎం. రాజు, డీపీఎం రాజు, నేచురోపతి మెడికల్ ఆఫీసర్ డా. అమృత వల్లి, ఆయుష్ వైద్యులు డా. రాజేందర్, డా. రాము, డా. శ్రీలత, అధికారులు, ప్రజాప్రతినిధులు, నర్సులు, ప్రజలు పాల్గొన్నారు.


