epaper
Wednesday, April 1, 2026
epaper

ఆయుర్వేద చదువులు ఆగమాగం!

ఆయుర్వేద చదువులు ఆగమాగం!
అధ్యాపక పోస్టులు అన్నీ ఖాళే!
15 మందికి ఒక్కరూ కూడా లేరు!
10 మంది కాంట్రాక్ట్ బోధకులతో కాలం వెళ్లదీత!
ఇతర సిబ్బంది కూడా అరకొరే!
ఇదీ అనంతలక్ష్మీ ఆయుర్వేద వైద్య కాలేజీ తీరు

కాకతీయ, వరంగల్ : ఆంగ్ల వైద్యం కంటే ఆయుర్వేద వైద్యంపైనే ప్రజలు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల నివారణ కోసం బాధితులు చెట్ల మందులనే ఇష్టపడుతున్నారు. నయం కావడానికి ఎక్కువ సమయం తీసుకున్నా.. పూర్తిస్థాయిలో తగ్గుతుందనే నమ్మకంతో ఆయుర్వేద వైద్యానికి ప్రస్తుతం డిమాండ్ పెరుగుతోంది. అయితే, ఆయుర్వేద విద్య అభివృద్ధి పట్ల మాత్రం నిర్లక్ష్యం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అందుకు వరంగల్ లోని అనంతలక్ష్మీ ఆయుర్వేద వైద్య కళాశాలలోని పరిస్థితులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆంగ్ల వైద్యాన్ని అడుగడుగునా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు వాటి సంఖ్య పెంచేందుకు లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. అవసరమైతే గల్లీకో హాస్పిటల్ కట్టేందుకు కూడా ప్రభుత్వాలు మొగ్గుచూపినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కానీ, పురాతన, పూర్వీకుల వైద్యంగా పేర్కొనే ఆయుర్వేద వైద్య రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు తగిన స్థాయిలో దృష్టి పెట్టడం లేదని స్పష్టమవుతోంది. పురాతన వస్తువుల పేరిట రాళ్లు, రప్పలను సేకరించి, వాటిని భద్రపరిచేందుకు వెచ్చించే అన్ని నిధులు కూడా ఆయుర్వేద వైద్య అభివృద్ధికి ప్రభుత్వాలు వెచ్చించడం లేదనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇందుకు వరంగల్ అనంతలక్ష్మీ ఆయుర్వేద వైద్య కాలేజీలో పరిస్థితులే నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పొచ్చు.

అరకొర సిబ్బందితోనే కాలం వెళ్లదీత!

అనంతలక్ష్మీ ఆయుర్వేద వైద్య కాలేజీలో అన్ని విభాగాల్లో ఉద్యోగులు, సిబ్బంది కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కాలేజీ కార్యకలాపాల నిర్వహణ కోసం ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ ఉన్నప్పటికీ.. అసలు కాలేజీ నడవడానికి అవసరమైన బోధకులే లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ కాలేజీకి 15 మంది అధ్యాపకులు ఉండాల్సి ఉంటుందని రికార్డులు వెల్లడిస్తుండగా, ప్రస్తుతం ఒక్కరు కూడా లేరు. కేవలం క్రాంటాక్ట్ అధ్యాపకులతో తరగతులు సాగిస్తున్నారు. అది కూడా పదిమందితోనే కాలం నెట్టుకొస్తున్నారు. ఆఫీసు కార్యకలాపాల్లో టైపిస్టు లేడు, లెబ్రేరియన్ పోస్ట్ ఒకటి ఖాళీగానే ఉంది. డ్రైవర్ నియమాకం నిలిచిపోయింది. వాచ్మెన్ నలుగురికి ఇద్దరే ఉన్నారు. స్వీపర్, స్కావెంజర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కేవలం ఒక్కరితోనే రెండు స్థాయిల పని చేయిస్తూ వ్యవస్థను లాగిస్తున్నారు. మొత్తంగా అన్ని విభాగాల్లో 67 మంది ఉండాల్సి ఉండగా, 28 మందితోనే చదువుల ఆలయంలో సేవలు కొనసాగుతున్నాయి. 39 పోస్టులు ఇంకా భర్తీ కావాల్సి ఉండగా, ప్రభుత్వం నియమించే అవకాశం లేదని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

20 క్వింటాల నల్ల బెల్లం 50 కేజీల పటిక పట్టివేత

20 క్వింటాల నల్ల బెల్లం 50 కేజీల పటిక పట్టివేత బొలెరో ట్రాలీ...

మల్లంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

మల్లంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం : మంత్రి సీతక్క మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు...

నిషేధిత ప్లాస్టిక్ తయారీపై దాడులు

నిషేధిత ప్లాస్టిక్ తయారీపై దాడులు రూ. 12 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం యజమానికి...

నేరెళ్ల యాదవ సంఘం అధ్యక్షుడిగా కుమారస్వామి

నేరెళ్ల యాదవ సంఘం అధ్యక్షుడిగా కుమారస్వామి కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా...

సాగునీరు వెంటనే విడుదల చేయాలి

సాగునీరు వెంటనే విడుదల చేయాలి డీబీఎం 38 కెనాల్ గేట్లు తెర‌వాలి దుగ్గొండి మండ‌ల...

చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపే లక్ష్యం

చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపే లక్ష్యం నారాయణ స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వరంగల్ జోన్...

స్థానికేతరులకు టికెట్ ఇవ్వొద్దు

స్థానికేతరులకు టికెట్ ఇవ్వొద్దు బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు బహిర్గతం ప్రెస్‌మీట్‌లో మైనార్టీ నాయకుల హెచ్చరిక కాకతీయ,...

మాది ప్రజా ప్రభుత్వం.. ప్రతి గింజ కొంటాం

మాది ప్రజా ప్రభుత్వం.. ప్రతి గింజ కొంటాం నెల్లికుదురుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img