epaper
Thursday, January 15, 2026
epaper

ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జాగృతి ‘జనం బాట’

ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జాగృతి ‘జనం బాట’
కవిత నాయకత్వంలో ప్రజా ఉద్యమంగా విస్తరిస్తున్న తెలంగాణ జాగృతి
*జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్

కాకతీయ, కరీంనగర్ : జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క చేపట్టిన ‘జనం బాట’ కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికి బలమైన వేదికగా మారిందని తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. కరీంనగర్‌లో జిల్లా జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కవితక్క ‘జనం బాట’ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఐడీపీఎల్ భూముల అంశంపై కవితక్క లేవనెత్తిన ప్రశ్నలకు స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గత రెండు నెలలుగా 11 జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజల గోడును వింటూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ తెలంగాణ జాగృతి ప్రజా ఉద్యమంగా ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రజల సూచనలు, సలహాలు స్వీకరిస్తూ జాగృతిని బలోపేతం చేస్తున్న ఈ ఉద్యమాన్ని కొంతమంది స్వార్థపరులు, కబ్జాకోరులు తట్టుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వ్యాఖ్యలను జాగృతి కరీంనగర్ జిల్లా తీవ్రంగా ఖండిస్తోందన్నారు. బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్ సాధించాలనే లక్ష్యంతో కవితక్క ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, అది ఓర్వలేక కొంతమంది నాయకులు పథకం ప్రకారం ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉండి బీసీలకు న్యాయం చేయని బీజేపీని కూడా కవిత ప్రజల ముందు ప్రశ్నిస్తున్నారని స్పష్టం చేశారు. జనం బాటకు వస్తున్న ప్రజల స్పందన చూస్తుంటే తెలంగాణ జాగృతిని రాజకీయ వేదికగా మారుస్తూ రాష్ట్రానికి కవితక్క నాయకత్వం వహించాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల్లో ఈ ఆకాంక్ష బలంగా వ్యక్తమవుతోందని, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న మద్దతు ఇందుకు నిదర్శనమన్నారు. కవితపై అసత్య ప్రచారం, అనవసర విమర్శలు చేస్తే జాగృతి కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో జాగృతి జిల్లా నాయకులు బూడిగ పరుశురాం గౌడ్, రంగరవేణి లక్ష్మణ్, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్, ఆటో విభాగం జిల్లా నాయకులు కొత్తూరి రఘు, జిల్లా నాయకులు గర్షకుర్తి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img