అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశా వర్కర్ల అరెస్ట్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ ముట్టడికి బస్సులలో బయలుదేరిన ఆశా వర్కర్లను పోలీసులు రేణికుంట టోల్ ప్లాజా వద్ద అడ్డుకున్నారు.దీంతో ఆగ్రహానికి గురైన ఆశా కార్యకర్తలు రహదారిపై నిలబడి నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి, పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.అనంతరం ఆశా వర్కర్లను కరీంనగర్ పీటీసీ సెంటర్కు తరలించారు.శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తున్న తమను అడ్డుకోవడం అన్యాయమని ఆశా కార్యకర్తలు పోలీసులను ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.


