epaper
Sunday, March 15, 2026
epaper

స్వేచ్ఛయుత ఎన్నిక‌ల‌కు ఏర్పాట్లు

స్వేచ్ఛయుత ఎన్నిక‌ల‌కు ఏర్పాట్లు
మునిసిపల్ పోరుకు పూర్తి స‌న్న‌ద్ధ‌త
జిల్లాలో ఐదు మునిసిపాలిటీలకు ఎన్నికలు
117 వార్డులు.. 242 పోలింగ్ కేంద్రాలు
25 సెన్సిటివ్‌, 33 క్రిటికల్ కేంద్రాల గుర్తింపు
నామినేషన్లకు 43 కేంద్రాల ఏర్పాటు
ఖ‌మ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లాలో మునిసిపల్ ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. రాష్ట్రంలో 7 మునిసిపల్ కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీలకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఏదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఐదు మునిసిపాలిటీల పరిధిలో మొత్తం 117 వార్డులు ఉండగా, 242 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎలక్టోరల్ రోల్‌కు సంబంధించి వచ్చిన 417 అభ్యంతరాలను పూర్తిగా పరిష్కరించినట్లు వివరించారు.

ఎన్నికల యంత్రాంగం సిద్ధం

సత్తుపల్లి మునిసిపాలిటీలో 28,830 మంది, మధిరలో 25,679 మంది, వైరాలో 24,689 మంది, ఏదులాపురంలో 45,256 మంది, కల్లూరులో 18,866 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం 55 మంది రిటర్నింగ్ అధికారులు, 55 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు, 291 మంది ప్రిసైడింగ్ అధికారులు, 948 మంది ఓపిఓలను నియమించినట్లు తెలిపారు. అదనంగా 26 జోనల్ అధికారులు, 10 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 10 ఎస్‌ఎస్‌టీ బృందాలను సిద్ధం చేశామన్నారు. ఎన్నికల ఖర్చుపై నిఘా కోసం ఐదుగురు వ్యయ పరిశీలకులు, రెండు అకౌంటింగ్ బృందాలను నియమించినట్లు వెల్లడించారు.

నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకూ..

నామినేషన్ల స్వీకరణకు ఏదులాపురంలో 13, కల్లూరులో 7, మధిరలో 8, సత్తుపల్లిలో 8, వైరాలో 7 కేంద్రాలు ఏర్పాటు చేసి మొత్తం 43 నామినేషన్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్‌రూమ్, కౌంటింగ్ కేంద్రాలను గుర్తించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు జరుగుతోందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఏదులాపురానికి 166, కల్లూరుకు 96, సత్తుపల్లికి 113, మధిరకు 106, వైరాకు 99 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసినట్లు కలెక్టర్ వివరించారు. 242 పోలింగ్ కేంద్రాల్లో 25 సెన్సిటివ్‌, 33 క్రిటికల్ కేంద్రాలను గుర్తించి భద్రతను పటిష్టం చేశామని, 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి, ఎన్నికల ప్రవర్తనా నియమావళి వెంటనే అమలులోకి వస్తుందని స్పష్టం చేసిన కలెక్టర్, అన్ని వర్గాల ప్రజలు సహకరించి స్వేచ్ఛాయుత, న్యాయబద్ధ ఎన్నికల నిర్వహణకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఫుడ్ పాయిజన్ ఘటనపై చర్యలు

ఫుడ్ పాయిజన్ ఘటనపై చర్యలు డిప్యూటీ వార్డెన్, హెచ్‌ఎం సస్పెన్షన్ కలుషిత ఆహారంతో విద్యార్థినులు...

డబ్బులు ఇస్తేనే పట్టా పాస్‌బుక్..!

డబ్బులు ఇస్తేనే పట్టా పాస్‌బుక్..! దళారుల ద్వారా డబ్బుల వసూళ్లు ఎకరానికి 25...

ప్రగతి విద్యాలయంలో ఘనంగా ఫేర్వెల్ డే

ప్రగతి విద్యాలయంలో ఘనంగా ఫేర్వెల్ డే ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థులు కాకతీయ, కూసుమంచి:...

చిన్నారులకు పాదరక్షల పంపిణీ

చిన్నారులకు పాదరక్షల పంపిణీ కోయగట్టు అంగన్వాడిలో సేవా కార్యక్రమం నిరుపేద విద్యార్థులకు చెప్పులు అందజేత కాకతీయ...

వెలుగుమట్ల నిర్వాసితులకు న్యాయం

వెలుగుమట్ల నిర్వాసితులకు న్యాయం ప్రభుత్వ గడువుకు ముందే పట్టాల పంపిణీ మంత్రుల చొరవతో వెలుగుమ‌ట్ల‌...

ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి

ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి కూసుమంచి మండలంలో అమానుష ఘటన ఫోక్సో చట్టం కింద...

కూల్చిన చోటే పట్టాల పంపిణీ..!

కూల్చిన చోటే పట్టాల పంపిణీ..! భూదాన్ భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు వెలుగుమట్ల భూదాన్...

ఊరి కోసం శ్రామికుడిగా పనిచేస్తా

ఊరి కోసం శ్రామికుడిగా పనిచేస్తా తాగునీరు పారిశుధ్యం పై దృష్టి సారిస్తా రేగళ్ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img