epaper
Friday, January 16, 2026
epaper

మైనార్టీ గురుకులాలకు దర‌ఖాస్తుల ఆహ్వానం

మైనార్టీ గురుకులాలకు దర‌ఖాస్తుల ఆహ్వానం
2026–27 విద్యా సంవత్సరానికి రిజిస్ట్రేషన్ ప్రారంభం
ఐదో తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ప్రవేశాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేక గురుకులాలు
నాణ్యమైన విద్యావకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్
అవగాహన కోసం ఆడియో–వీడియో ప్రచారం ప్రారంభం

కాకతీయ, కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ శుక్రవారం ఐడీఓసి క్యాంప్ కార్యాలయంలో అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను మైనార్టీ గురుకులాల్లో చేర్పించి ప్రభుత్వం కల్పిస్తున్న నాణ్యమైన ఉచిత విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐదవ తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో బాలురు, బాలికలకు విడివిడిగా, బూర్గంపాడులో బాలికలకు, భద్రాచలంలో బాలురకు, అశ్వారావుపేటలో బాలికలకు, ఇల్లందులో బాలికలకు మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

మైనార్టీ విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రతిష్టాత్మకంగా గురుకులాలను ఏర్పాటు చేసిందని, వీటిలో ఉచిత వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాలను ప్రతి అర్హుడైన విద్యార్థి ఉపయోగించుకోవాలని కోరారు. మైనార్టీ గురుకులాలపై అవగాహన పెంచేందుకు విజిలెన్స్ అధికారి కే.సీతారాములు రూపొందించిన ఆడియో, వీడియో పాటలను జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కే.సంజీవరావు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ ప్రచారం ద్వారా అడ్మిషన్ల సమాచారం విస్తృతంగా ప్రజలకు చేరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అభివృద్ధి అధికారి కే.సంజీవరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్‌ఎల్‌సీ ఎం.జే. అరుణకుమారి, విజిలెన్స్ అధికారులు కే.సీతారాములు, ఎం.ఏ.రవూఫ్, మైనార్టీ గురుకులాల పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సంబంధిత గురుకులాల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు.. ఎన్నిక‌లే త‌రువాయి..!

రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు.. ఎన్నిక‌లే త‌రువాయి..! ఖమ్మం కార్పోరేష‌న్‌, మునిసిపాలిటీల్లో రిజ‌ర్వేష‌న్ల కేటాయింపు బీసీలకు పెరిగిన‌...

నిబంధనల గీత దాటొద్దు!

నిబంధనల గీత దాటొద్దు! భద్రత, ప్రోటోకాల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి మినిట్ టు మినిట్...

సీఎం పర్యటనతో ఖమ్మంలో ట్రాఫిక్ ఆంక్షలు

సీఎం పర్యటనతో ఖమ్మంలో ట్రాఫిక్ ఆంక్షలు ▪️ 18న ఉదయం 11 నుంచి...

18న పాలేరుకు సీఎం రేవంత్‌

18న పాలేరుకు సీఎం రేవంత్‌ ▪️ రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,...

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img