epaper
Monday, March 2, 2026
epaper

కమలాపూర్‌లో అన్ని సర్పంచ్ స్థానాలు మా ఖాతాలోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

కమలాపూర్‌లో అన్ని సర్పంచ్ స్థానాలు మా ఖాతాలోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

కేసీఆర్ పథకాల్ని బందు పెట్టిన కాంగ్రెస్‌ని బొంద పెట్టాలి ఓటుతో బుద్ధి చెప్పాలి

కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం మొత్తం బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కమలాపూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈనెల 11న జరగనున్న సర్పంచ్ ఎన్నికల తొలి విడతలో కమలాపూర్ మండలంలోని 23 గ్రామపంచాయతీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని, అలాగే మూడో విడతలో హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక,ఇల్లంతకుంట మండలాల్లో కూడా పార్టీ ఘనవిజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. మొత్తం హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 107 గ్రామపంచాయతీలన్నీ బీఆర్ఎస్ ఖాతాలో పడతాయన్నారు.కమలాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దశరథం పేరును ఫైనల్ చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ అంతర్గత ఆశావాహులెవరూ బాధపడకూడదని, భవిష్యత్తులో ప్రతి ఒక్కరికీ తగిన గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు.కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కమలాపూర్ మండలంలో అభివృద్ధి అంటే కేసీఆర్ గారు చేసిన పనులే గుర్తుకు వస్తాయి. రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కానీ ఈ ప్రాంతంలో తట్టెడు మన్ను కూడా పోశారా? ప్రజలు ఆలోచించాలి అన్నారు.అలాగే స్థానిక రాజకీయాలపై మండిపడుతూ.ఈ ప్రాంతానికే నాయకుడిని అని చెప్పుకునే ఒకరు ఇక్కడ ఓడిపోయాక బయట ప్రాంతాల్లో పోటీకి వెళ్లాడు. కానీ నేను మాత్రం హుజురాబాద్ ప్రజల కోసం పోరాడుతూ నిలబడిన వ్యక్తిని. బైట ప్రాంతాల నుంచి వచ్చి ‘మీ నాయకున్ని’ అంటున్నవారిని నమ్మొద్దు, అన్నారు.కేంద్ర,రాష్ట్ర నిధుల విషయంలో తీవ్ర విమర్శలు చేస్తూ 2019 నుండి 2025 వరకు రాష్ట్రం కేంద్రానికి 4 లక్షల కోట్లకుపైగా పన్ను చెల్లించింది, తిరిగి వచ్చినది మూడులక్షల కోట్లలోపే. రాష్ట్రం పంపిన ప్రతి రూపాయికి కేంద్రం 84 పైసలు మాత్రమే తిరిగి ఇస్తోంది. 16 పైసలు వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాయి. ఈ నిజాలపై చర్చకు సిద్ధం అన్నారు.తాను చెప్పినవి అబద్ధమైతే కమలాపూర్ గ్రామంలో ‘ముక్కు నేలకు రాసేందుకు’ కూడా సిద్ధమని సవాల్ విసిరారు.అంతేకాకుండా ఉపఎన్నికల సమయంలో గెలిచిన ఈటల రాజేందర్ కేంద్రం నుంచి ఏమాత్రం నిధులు తెచ్చారో కూడా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కమలాపూర్ ఆయన స్వగ్రామం అయినప్పటికీ అక్కడ కూడా అభివృద్ధి జరగలేదన్నారు.కేసీఆర్ హయాంలో చిన్న గ్రామాలకు 30 కోట్లు, పెద్ద గ్రామాలకు 100 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేశారని, ఈ ప్రాంతంలోని దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయలు అందించినవారు కూడా కేసీఆర్ గారేనని గుర్తుచేశారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ ఒకటొకటిగా బంద్ చేసిందని, ప్రజలు ఈసారి కాంగ్రెస్,బీజేపీలకు ఓటు ఆయుధంతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img