నర్సంపేటలో ఎయిర్టెల్ విధ్వంసం
అనుమతి లేకుండానే కేబుల్ తవ్వకాలు
నీటి సరఫరా వ్యవస్థకు తీవ్ర అంతరాయం
నిబంధనలు ఉల్లంఘించిన ఎయిర్టెల్పై చర్యలు
మున్సిపల్ చైర్పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్
కాకతీయ,నర్సంపేట టౌన్ : అనుమతులు లేకుండా రోడ్లపై తవ్వకాలు చేయడం వల్ల నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని మున్సిపల్ చైర్పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో వరంగల్ మెయిన్ రోడ్, ద్వారకపేట మెయిన్ రోడ్లపై ఎయిర్టెల్ నెట్వర్క్ సంస్థ రాత్రికి రాత్రే భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టింది. ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. పలుచోట్ల వాటర్ పైప్లైన్లు పగిలిపోయాయి. పట్టణంలో నీటి సరఫరా అంతరాయం ఏర్పడింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ అనుమతి లేకుండా తవ్వకాలు చేయడం నిబంధనల ఉల్లంఘన అని స్పష్టం చేశారు. వెంటనే దెబ్బతిన్న పైప్లైన్లను మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశించారు. నీటి సరఫరాను త్వరగా పునరుద్ధరించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన ఎయిర్టెల్ నెట్వర్క్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో యంత్రాలతో తవ్వకాలు చేయవద్దని హెచ్చరించారు. అవసరమైతే మానవ వనరులతో పనులు చేయాలని సూచించారు. రేపటిలోగా పైప్లైన్ మరమ్మతులు పూర్తి చేస్తామని తెలిపారు. నీటి సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు బీరం భరత్ రెడ్డి, హనుమకొండ శ్రీధర్, బాణాల ప్రసన్న శ్రీనివాస్, పొన్నాల మనీషా ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాట ప్రభాకర్, కీసర వెంకటేశ్వర్లు, యూత్ నాయకులు మెరుగు కిరణ్, ఉప్పుల శాలూమ్, దేవోజ్ హేమంత్, చీకటి శివమణి, టౌన్ వాటర్ లైన్ ఇంచార్జ్ కాట శ్రీను తదితరులు పాల్గొన్నారు.


