epaper
Monday, March 2, 2026
epaper

ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామ పంచాయతీ కార్యదర్శి

కాకతీయ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో అవినీతి బహిర్గతమైంది. కర్ణమామిడి గ్రామానికి చెందిన గ్రామ కార్యదర్శి వెంకటస్వామి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతిలో పట్టుబడ్డాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఓ బాధితుడు తనకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు స్కీమ్లో ఇల్లు కోసం గ్రామ కార్యదర్శి వద్ద దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే దీనికి సంబంధించి ఫైలు ముందుకు జరగాలంటే రూ. 20,000 లంచం ఇవ్వాలని వెంకటస్వామి డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు చేసేది ఏమీ లేక ఏసీబీ అధికారులను సంప్రదించాడు.

ఏసీబీ ప్రత్యేక బృందం ప్లాన్ ప్రకారం, బాధితుడు డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇవ్వబోయే సమయంలోనే గ్రామ కార్యదర్శిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకుంటున్న సాక్ష్యాలను అధికారులు రికార్డ్ చేశారు. ప్రస్తుతం వెంకటస్వామిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది.

ప్రజలకు అందే సంక్షేమ పథకాలు నిజంగా అర్హులైన వారికి చేరకుండా, లంచం పేరుతో అవినీతికి పాల్పడటం పట్ల స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఇటువంటి అవినీతి చర్యలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఏసీబీ అధికారులు ఈ కేసు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రాజకీయంగానే కేసులు నమోదు చేశారు”

రాజకీయంగానే కేసులు నమోదు చేశారు” -బీఆర్ఎస్ నాయకులు కాకతీయ, రామకృష్ణాపూర్ : రాజకీయంగా ఎదురుకోలేకనే...

కాంగ్రెస్ విష ప్రచారం నమ్మొద్దు

కాంగ్రెస్ విష ప్రచారం నమ్మొద్దు సీపీఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ కాకతీయ, రామకృష్ణాపూర్ :...

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img