epaper
Monday, March 2, 2026
epaper

ఆర్టీఏ చెక్ పోస్టుల్లో ఏసీబీ రైడ్‌..!

  • ఏక కాలంలో 12 చోట్ల దాడులు
  • బోరజ్ చెక్‌పోస్టులో రూ.1.26వేల ప‌ట్టివేత‌
  • సలాబత్ పూర్, కృష్ణ చెక్ పోస్టుల్లోనూ న‌గ‌దు ప‌ట్టివేత‌
  • చెక్‌పోస్టులు ఎత్తేసినా కొన‌సాగిస్తున్న అధికారులు
  • వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతూ వేధిస్తున్న‌ట్లుగా ఏసీబీకి ఫిర్యాదులు
  • ప‌కడ్బందీగా ఏక కాలంలో దాడులు
  • ఉలిక్కిప‌డిన ఆర్టీఏలోని అవినీతి అధికారులు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : అక్ర‌మ వ‌సూళ్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన ఆర్టీఏ చెక్‌పోస్టుల‌పై ఆదివారం ఏసీబీ అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వ‌హించారు. శ‌నివారం అర్ధ‌రాత్రి నుంచి మొద‌లైన ఏసీబీ బృందాల దాడులు ఆదివారం ఉద‌యం వ‌ర‌కు కొన‌సాగాయి. ఏక కాలంలో ఏసీబీ అధికారులు చెక్ పోస్టుల‌పై త‌నిఖీలు నిర్వ‌హించ‌డంతో అవినీతి లింకులున్న అధికారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తాయి. రోజూ ఒక్కో చెక్ పోస్టులో ల‌క్ష‌లాది రూపాయాల మాముళ్లు మాములుగానే వ‌సూళ్లు చేస్తున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి. ఈ క్ర‌మంలోనే ట్రాన్స్‌పోర్టు వెహికిల్ య‌జ‌మానుల నుంచి ఏసీబీ అధికారుల‌కు ఫిర్యాదులు అంద‌డంతో ప‌క‌డ్బందీగా ఏక కాలంలో దాడులు నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం.

12 ఆర్టీఏ చెక్ పోస్టుల‌పై దాడులు

ఆర్టీఏ చెక్ పోస్టుల్లో అడ్డగోలుగా అధికారులు, సిబ్బంది వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లుగా సామాన్య ప్ర‌జ‌లు, వాహ‌న‌దారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఏసీబీ అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వ‌హించారు. మొత్తం 12 చోట్ల దాడులు నిర్వ‌హించిన అధికారులు రూ.4ల‌క్ష‌ల 18వేల 880ను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు దాడులు నిర్వ‌హించిన చెక్ పోస్టుల్లో తెలంగాణ‌-ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంత‌రాష్ట్ర స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన న‌ల్గొండ జిల్లాలోని విష్ణుపురం (వాడేప‌ల్లి), సూర్య‌పేట జిల్లాలోని కోదాడ చెక్ పోస్టు, తెలంగాణ‌-క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దులోని నారాయ‌ణ‌పేట జిల్లాలోని కృష్ణ అంత‌రాష్ట్ర‌చెక్ పోస్టు, తెలంగాణ‌- మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన ఆదిలాబాద్ జిల్లాలోని బోర‌జ్ అంత‌రాష్ట్ర చెక్ పోస్టు, నిర్మ‌ల్ జిల్లాలోని బైంసా చెక్ పోస్టు, అసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి చెక్‌పోస్టు, కామారెడ్డి జిల్లా మ‌ద్నూర్ మండ‌లంలోని స‌లాబ‌త్పూర్‌, పెందూర్తి చెక్‌పోస్టు, సంగారెడ్డి జిల్లాలోని జ‌హీరాబాద్ చెక్ పోస్టు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని పాల్వంచ‌, అశ్వారావుపేట, ఖ‌మ్మం జిల్లాలోని ముత్తుగూడెం(పెనుబ‌ల్లి)లు ఉన్నాయి.

బోరజ్ చెక్‌పోస్టులో రూ.1.26వేల ప‌ట్టివేత‌

ఆదిలాబాద్ జిల్లా బోరజ్ అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్‌పోస్టు రాత్రి 12 గంటల నుంచి ఉదయం వరకు సోదాలు నిర్వహించిన అధికారులు పెద్ద మొత్తంలో వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లుగా గుర్తించారు.ఏసీబీ అధికారుల‌ను గుర్తించిన సిబ్బంది పారిపోయేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లుగా తెలుస్తోంది. సిబ్బంది నుంచి రూ.1.26 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.అలాగే కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్ పూర్ ఆర్టీఏ చెక్ పాయింట్ వద్ద ఏసీబీ అధికారులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. వాహ‌న‌దారుల నుంచి వ‌సూలు చేసిన‌ట్లుగా గుర్తించిన అధికారులు సిబ్బందిని రూ. 36 వేలను స్వాధీనం చేసుకున్నారు.

చెక్ పోస్టులు ఎత్తేసినా.. వ‌సూళ్ల కోస‌మే కొన‌సాగింపు..!!

చెక్​పోస్టుల తొలగింపు వల్ల వాహనాల సగటు వేగం పెంచ‌డంతో పాటు.. ట్రాఫిక్​ సమస్యను త‌గ్గించే ల‌క్ష్యంతో చెక్ పోస్టులను రాష్ట్ర ప్ర‌భుత్వం ఎత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను తొలగిస్తూ ఆగ‌స్టు నెల‌లోనే ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్రాష్ట్ర సరిహద్దు ఉండే జిల్లాలో ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం కొంతమంది రవాణా శాఖ అధికారులకు మాత్రం మింగుడు పడటం లేదు. చెక్‌పోస్టుల్లో ఎంవీఐ(మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్), ఏఎంవీఐలతోపాటు కానిస్టేబుల్స్, సిబ్బంది 24 గంటల పద్ధతిలో పనిచేస్తుంటారు. అయితే ఇక్కడ అందించే సేవలన్నీ ఇకపై ఆన్‌లైన్‌లోనే సమకూర్చాలని నిర్ణయించారు. త‌ద‌నుగుణంగానే సర్వర్‌లో మార్పులు చేశారు. అయితే ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసినా ఆర్టీఏ అధికారులు మాత్రం త‌నిఖీల పేరుతో వాహ‌న‌దారుల‌ను ఇబ్బందుల పాలు చేయ‌డ‌మే కాకుండా వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా ఫిర్యాదులు వెల్లువెత్త‌డంతో ఏసీబీ త‌నిఖీలు చేప‌ట్ట‌డం గ‌మనార్హం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img