epaper
Saturday, November 15, 2025
epaper

ఆర్టీఏ చెక్ పోస్టుల్లో ఏసీబీ రైడ్‌..!

  • ఏక కాలంలో 12 చోట్ల దాడులు
  • బోరజ్ చెక్‌పోస్టులో రూ.1.26వేల ప‌ట్టివేత‌
  • సలాబత్ పూర్, కృష్ణ చెక్ పోస్టుల్లోనూ న‌గ‌దు ప‌ట్టివేత‌
  • చెక్‌పోస్టులు ఎత్తేసినా కొన‌సాగిస్తున్న అధికారులు
  • వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతూ వేధిస్తున్న‌ట్లుగా ఏసీబీకి ఫిర్యాదులు
  • ప‌కడ్బందీగా ఏక కాలంలో దాడులు
  • ఉలిక్కిప‌డిన ఆర్టీఏలోని అవినీతి అధికారులు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : అక్ర‌మ వ‌సూళ్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన ఆర్టీఏ చెక్‌పోస్టుల‌పై ఆదివారం ఏసీబీ అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వ‌హించారు. శ‌నివారం అర్ధ‌రాత్రి నుంచి మొద‌లైన ఏసీబీ బృందాల దాడులు ఆదివారం ఉద‌యం వ‌ర‌కు కొన‌సాగాయి. ఏక కాలంలో ఏసీబీ అధికారులు చెక్ పోస్టుల‌పై త‌నిఖీలు నిర్వ‌హించ‌డంతో అవినీతి లింకులున్న అధికారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తాయి. రోజూ ఒక్కో చెక్ పోస్టులో ల‌క్ష‌లాది రూపాయాల మాముళ్లు మాములుగానే వ‌సూళ్లు చేస్తున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి. ఈ క్ర‌మంలోనే ట్రాన్స్‌పోర్టు వెహికిల్ య‌జ‌మానుల నుంచి ఏసీబీ అధికారుల‌కు ఫిర్యాదులు అంద‌డంతో ప‌క‌డ్బందీగా ఏక కాలంలో దాడులు నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం.

12 ఆర్టీఏ చెక్ పోస్టుల‌పై దాడులు

ఆర్టీఏ చెక్ పోస్టుల్లో అడ్డగోలుగా అధికారులు, సిబ్బంది వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లుగా సామాన్య ప్ర‌జ‌లు, వాహ‌న‌దారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఏసీబీ అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వ‌హించారు. మొత్తం 12 చోట్ల దాడులు నిర్వ‌హించిన అధికారులు రూ.4ల‌క్ష‌ల 18వేల 880ను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు దాడులు నిర్వ‌హించిన చెక్ పోస్టుల్లో తెలంగాణ‌-ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంత‌రాష్ట్ర స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన న‌ల్గొండ జిల్లాలోని విష్ణుపురం (వాడేప‌ల్లి), సూర్య‌పేట జిల్లాలోని కోదాడ చెక్ పోస్టు, తెలంగాణ‌-క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దులోని నారాయ‌ణ‌పేట జిల్లాలోని కృష్ణ అంత‌రాష్ట్ర‌చెక్ పోస్టు, తెలంగాణ‌- మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన ఆదిలాబాద్ జిల్లాలోని బోర‌జ్ అంత‌రాష్ట్ర చెక్ పోస్టు, నిర్మ‌ల్ జిల్లాలోని బైంసా చెక్ పోస్టు, అసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి చెక్‌పోస్టు, కామారెడ్డి జిల్లా మ‌ద్నూర్ మండ‌లంలోని స‌లాబ‌త్పూర్‌, పెందూర్తి చెక్‌పోస్టు, సంగారెడ్డి జిల్లాలోని జ‌హీరాబాద్ చెక్ పోస్టు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని పాల్వంచ‌, అశ్వారావుపేట, ఖ‌మ్మం జిల్లాలోని ముత్తుగూడెం(పెనుబ‌ల్లి)లు ఉన్నాయి.

బోరజ్ చెక్‌పోస్టులో రూ.1.26వేల ప‌ట్టివేత‌

ఆదిలాబాద్ జిల్లా బోరజ్ అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్‌పోస్టు రాత్రి 12 గంటల నుంచి ఉదయం వరకు సోదాలు నిర్వహించిన అధికారులు పెద్ద మొత్తంలో వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లుగా గుర్తించారు.ఏసీబీ అధికారుల‌ను గుర్తించిన సిబ్బంది పారిపోయేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లుగా తెలుస్తోంది. సిబ్బంది నుంచి రూ.1.26 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.అలాగే కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్ పూర్ ఆర్టీఏ చెక్ పాయింట్ వద్ద ఏసీబీ అధికారులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. వాహ‌న‌దారుల నుంచి వ‌సూలు చేసిన‌ట్లుగా గుర్తించిన అధికారులు సిబ్బందిని రూ. 36 వేలను స్వాధీనం చేసుకున్నారు.

చెక్ పోస్టులు ఎత్తేసినా.. వ‌సూళ్ల కోస‌మే కొన‌సాగింపు..!!

చెక్​పోస్టుల తొలగింపు వల్ల వాహనాల సగటు వేగం పెంచ‌డంతో పాటు.. ట్రాఫిక్​ సమస్యను త‌గ్గించే ల‌క్ష్యంతో చెక్ పోస్టులను రాష్ట్ర ప్ర‌భుత్వం ఎత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను తొలగిస్తూ ఆగ‌స్టు నెల‌లోనే ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్రాష్ట్ర సరిహద్దు ఉండే జిల్లాలో ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం కొంతమంది రవాణా శాఖ అధికారులకు మాత్రం మింగుడు పడటం లేదు. చెక్‌పోస్టుల్లో ఎంవీఐ(మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్), ఏఎంవీఐలతోపాటు కానిస్టేబుల్స్, సిబ్బంది 24 గంటల పద్ధతిలో పనిచేస్తుంటారు. అయితే ఇక్కడ అందించే సేవలన్నీ ఇకపై ఆన్‌లైన్‌లోనే సమకూర్చాలని నిర్ణయించారు. త‌ద‌నుగుణంగానే సర్వర్‌లో మార్పులు చేశారు. అయితే ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసినా ఆర్టీఏ అధికారులు మాత్రం త‌నిఖీల పేరుతో వాహ‌న‌దారుల‌ను ఇబ్బందుల పాలు చేయ‌డ‌మే కాకుండా వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా ఫిర్యాదులు వెల్లువెత్త‌డంతో ఏసీబీ త‌నిఖీలు చేప‌ట్ట‌డం గ‌మనార్హం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్ కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం ముఖ్యమంత్రి...

కేటీఆర్ బ‌క్వాస్‌..

కేటీఆర్ బ‌క్వాస్‌.. ఆయ‌న మాట‌లు న‌మ్మొద్దు వ‌చ్చే ఐదేండ్లు రేవంత్ సీఎంగా ఉంటారు న‌వీన్ యాదవ్‌ను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img