epaper
Thursday, January 15, 2026
epaper

కాలుష్యంపై ప్రత్యేక ప్లాన్ అవసరం

కాలుష్యంపై ప్రత్యేక ప్లాన్ అవసరం

లేకుంటే ప్రమాదంలో కోట్లాది మంది

దేశంలో పెరిగిపోతున్న క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలు

ఇది జాతీయ ఆరోగ్య సంక్షోభం

ఈ అంశంపై ప్రభుత్వం- ప్రతిపక్షం కలిసి చర్చించాలి

వ్యవస్థాత్మక ప్రణాళిక రూపొందించాలి

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: దేశంలోని ప్రధాన నగరాలన్నీ విషపూరిత గాలితో కమ్ముకున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని, కోట్లాది మంది పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ సమస్య రాజకీయాలకతీతమైందని, ప్రభుత్వం- ప్రతిపక్షం కలిసి చర్చించి ఒక వ్యవస్థాత్మక ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. లోక్‌స‌భ‌లో శుక్ర‌వారం రాహుల్‌గాంధీ మాట్లాడారు. దేశంలోని చాలా పెద్ద నగరాలు ప్రాణాంతక గాలిముసుగులో జీవిస్తున్నాయి. కోట్లాది పిల్లలకు ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయి. వారి భవిష్యత్తు నాశనం అవుతోంది. వేలాది మంది క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ఇది రాజకీయాల అంశం కాదు. అధికారపక్షం- ప్రతిపక్షం అందరూ ఏకాభిప్రాయం కాగలిగే విషయం ఇది అని అన్నారు.

దేశానికి ఉపయోగపడే చర్చ జరగాలి

దేశంలో పెరుగుతున్న కాలుష్యంపై చర్చ నిర్వహించి, ప్రతి మెట్రో నగరానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రధాని ముందుకు రావాలని రాహుల్ సూచించారు. ఒకరినొకరు విమర్శించుకునే చర్చలు కాకుండా, దేశానికి ఉపయోగపడే చర్చ జరగాలి. వచ్చే ఐదేళ్లలో అయినా, పది సంవత్సరాల్లో అయినా, కాలుష్యాన్ని పూర్తిగా నిర్మూలించలేకపోయినా కనీసం సమస్య తగ్గించే దిశగా ప్రభుత్వం ఒక పద్ధతిగల ప్రణాళికను తీసుకురావాలి అని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. దిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కాలుష్యం నిరంతరం పెరుగుతున్నందున, ఒక్కో నగరానికి విడి ప్రణాళిక అవసరమని చెప్పారు. ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్ ప్రమాదం పెరుగుతోందని, ఇది జాతీయ ఆరోగ్య సంక్షోభమని రాహుల్ హెచ్చరించారు.

చర్చకు సిద్ధమేననన్న కిరణ్ రిజిజు

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ప్రతిస్పందించిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ప్రభుత్వం చర్చకు పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు. “ప్రాధాన్యం గల అన్ని అంశాలపై చర్చించేందుకు మేం మొదటి రోజు నుంచే సిద్ధం. సభ్యులందరి సూచనలను వినడానికి, వాటిని తీసుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. నియమాలు, నిబంధనల ప్రకారం ఈ చర్చను ఎలా తీసుకెళ్లాలన్నదాన్ని పరిశీలిస్తాం” అని రిజిజు చెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ 12 మందికిపైగా మావోయిస్టులు హతం మృతులంతా కొంటా ఏరియా కమిటీ...

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌ అందరికంటే ముందే కొత్త ఏడాదికి ఆహ్వానం ఆక్లాండ్‌లో ఘనంగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img