epaper
Tuesday, March 31, 2026
epaper

సీడ్ కంపెనీ మోసం

సీడ్ కంపెనీ మోసం
ఆశ చూపించి విత్తనాలు విక్ర‌యం
కొనుగోలు స‌మ‌యంలో చేతులెత్తేసిన ఆర్గ‌నైజ‌ర్లు
క్వింటాకు అధిక ధ‌ర చెల్లిస్తామ‌ని సాగుకు హామీ
ఇప్పుడు పంట‌ను తీసుకెళ్ల‌డానికి ముందుకు రాని వైనం
ప్రజావాణిలో గోడు వెల్ల‌గ‌క్కుకున్న గిరిజ‌న రైతులు
ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేత
న్యాయం చేయాలని గిరిజన రైతుల వేడుకోలు

కాకతీయ, కారేపల్లి : అమాయక గిరిజన రైతులను నమ్మించి విత్తనాలు వేయించి, పంట చేతికొచ్చే సమయానికి ఆర్గనైజర్లు ముఖం చాటేయడంతో తవసిబోడు గ్రామానికి చెందిన రైతులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. సింగరేణి మండలంలోని రేలకాయలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధిత రైతులు తమ గోడును వెల్లగక్కారు. తమకు జరిగిన అన్యాయంపై తహసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. పంటపై పెట్టిన పెట్టుబడి మొత్తం వృథా అయిందని, ఇప్పుడు తమ పరిస్థితి దయనీయంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వైరా ప్రాంతానికి చెందిన తీగల బంజారి నివాసి ఎస్.కె సైదా అనే వ్యక్తి, తవసిబోడుకు చెందిన భూక్యా చందర్ అనే ఏజెంట్ ద్వారా గ్రామంలోని రైతులను సంప్రదించినట్లు తెలుస్తోంది. క్రిస్టల్ కంపెనీకి చెందిన ఒక ప్రత్యేక మొక్కజొన్న విత్తనాన్ని సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందని, క్వింటాకు 3200 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ మాటలు నమ్మిన రైతులు సుమారు 45 ఎకరాల్లో పంట సాగు చేశారు. విత్తనాలు, ఎరువులు, కూలీల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. మంచి దిగుబడి వస్తుందనే ఆశతో పంటను జాగ్రత్తగా పెంచారు. పంట కోతకు వచ్చిన తర్వాత ఆర్గనైజర్లను సంప్రదించగా వారు ఫోన్ ఎత్తడం మానేశారని రైతులు చెబుతున్నారు. కంపెనీని సంప్రదిస్తే అలాంటి విత్తనాలు తమ దగ్గర లేవని చెప్పడంతో రైతులు షాక్‌కు గురయ్యారు. తాము పూర్తిగా మోసపోయామని, ఇప్పుడు పండించిన పంటను ఎవరికి అమ్మాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. పెట్టుబడులు తిరిగి రాకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బాధిత రైతులు నరేందర్, రమేష్, వీరబాబు, నాగేశ్వరరావు, రాంబాబు, సీతారాం, దీప్లా, రాంచంద్, బాల తదితరులు కలిసి అధికారులను ఆశ్రయించారు. ఈ ఘటన గిరిజన రైతులపై జరుగుతున్న మోసాలను మరోసారి బహిర్గతం చేసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆర్గనైజర్లను పిలిపించి పంట కొనుగోలు చేయించేలా చర్యలు తీసుకోవాలని, తమకు జరిగిన నష్టానికి న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నేలకొండపల్లి బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేయాలి

నేలకొండపల్లి బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేయాలి జాతీయ బౌద్ధ పర్యాటక సర్క్యూట్ లో...

గిరిజన గర్భిణీలకు మెరుగైన మాతృసేవలు

గిరిజన గర్భిణీలకు మెరుగైన మాతృసేవలు టిఫ్ఫా స్కాన్ సేవలు అందుబాటులోకి డీసీహెచ్ ఎస్ డాక్టర్...

ఒలంపియాడ్ విజేతలకు బహుమతుల ప్రదానం

ఒలంపియాడ్ విజేతలకు బహుమతుల ప్రదానం కాకతీయ,ఖమ్మం : స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో...

ఆశ వర్కర్లపై నిర్బంధాన్ని ఖండించాలి

ఆశ వర్కర్లపై నిర్బంధాన్ని ఖండించాలి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీలం నరసింహారావు కాకతీయ, మధిర...

కాసులు లేని కార్పొరేషన్ ఎందుకు?

కాసులు లేని కార్పొరేషన్ ఎందుకు? ఎన్నాళ్లు ఈ సమస్యలతో కొట్లాడాలి వెన్నెల నగర్‌లో నీటి...

ప్ర‌మాదం కాదు.. హ‌త్య‌..!

ప్ర‌మాదం కాదు.. హ‌త్య‌..! లాభాల కోసం ప్రాణాల పణంగా పెడుతున్నారంటూ విమ‌ర్శ‌ దుర్గా యాజమాన్యం...

మౌలిక వసతులే కార్పొరేటర్ల అజెండా కావాలి

మౌలిక వసతులే కార్పొరేటర్ల అజెండా కావాలి ఫ్లెక్సీల అల్లకల్లోలాన్ని కట్టడి చేయాలి అమృత్ నిధులతో...

ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకు సాగాలి

ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకు సాగాలి టీ టీడీపీ రాష్ట్ర నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు ఖమ్మంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img