epaper
Saturday, November 15, 2025
epaper

దిక్కుమాలిన ప్ర‌భుత్వం

  • విద్యా వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టు ప‌ట్టించింది
  • విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్స్‌.. అధ్యాప‌కులకు జీతాలు లేవ్‌
  • పిల్ల‌లు క‌లెక్ట‌రేట్ల ద‌గ్గ‌ర ధ‌ర్నా చేసే దుస్థితి దాపురించింది
  • వెంట‌నే ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించాలి
  • మ‌ల్కాజ్‌గిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హస్తినాపురం సెంట్రల్ దగ్గర విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యదర్శి నరేష్ యాదవ్ చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కాలేజీ, స్కూలు యాజమాన్యాలు అనేకసార్లు అల్టిమేటం ఇచ్చినా ఈ ప్రభుత్వానికి సెన్సిటివిటీ లేద‌న్నారు. ప్రజల పట్ల బాధ్యత, నిజాయితీ లేదు.
లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆక్రందన కాబట్టి మేము కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం. ఈ వేదిక నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.. తాత్సారం చేయకుండా.. శషబిశలు లేకుండా వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి నీకు నిధులు ఉన్నాయి. కానీ వీరికి ఇవ్వడానికి లేవా ?
కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తే మీకు కమిషన్లు వస్తాయి. వాటిని ఢిల్లీకి పంపించుకోవచ్చు అనుకుంటున్నారు. అంటూ మండిప‌డ్డారు.

నిల‌దీస్తాం..

కాలేజీ, స్కూలు యాజమాన్యాలు జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి లేద‌ని ఈట‌ల ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత మాస్టర్స్ కోసం, ఉద్యోగాల కోసం వెళ్దామంటే సర్టిఫికెట్లు రాక సొంత డబ్బులు అప్పులు చేసి కట్టుకొని సర్టిఫికెట్ తీసుకుంటున్నార‌న్నారు. అంత గంభీరమైన సమస్య అయినా ప్రభుత్వం ఆలోచన చేయడం లేద‌న్నారు. గ్రామాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేద‌న్నారు. పిల్లలకు డైట్ చార్జీలు లేవు.
ఏజెన్సీలకు డబ్బులు ఇవ్వకపోవడంతో అన్నం పెట్టలేక కలెక్టరేట్ల ముందట ధర్నా చేసే పరిస్థితి వచ్చింద‌ని మండిప‌డ్డారు. విద్యావ్య‌వ‌స్థ‌పై రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంద‌న్నారు. విద్యా వ్యవస్థలో పదివేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయ‌న్నారు. రీ యంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే రాబోయే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాన్ని నిలదీస్తామ‌ని హెచ్చ‌రించారు.

దుర్మార్గ‌మైన స‌ర్కార్‌

మధ్యతరగతి పేద పిల్లలు పెద్ద పెద్ద కాలేజీలో చదువుకోవడానికి పెట్టిన స్కీం ఫీజు రియంబర్స్మెంట్.
కేసీఆర్ ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు బకాయిలు పెట్టారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రెండేళ్లయినా చెల్లించలేదు. నాలుగు సంవత్సరాలుగా ఫీజు రీఎంబర్స్మెంట్ లేకపోవడం వల్ల పిల్లల‌పై చదువులకు పోవడానికి ఉద్యోగాలు చేసుకోవడానికి తల్లిదండ్రులే మళ్లీ ఆ డబ్బులు కట్టి అప్పులు చేసి బజారున పడే పరిస్థితి వచ్చింది. గత్యంతరం లేక సమ్మెకు నోటు ఇస్తే పదివేల కోట్లలో 600 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రైవేట్ యాజమాన్యాల కు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రైవేటు కాలేజీల్లో పనిచేస్తున్న టీచర్లకు స్టాఫ్ కు జీతభత్యాలు లేవు. ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూళ్లలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ల పేరుట కొన్ని వేల మందికి అడ్మిషన్లు ఇస్తారు. ఆ పిల్లలకు సంవత్సరానికి 42 వేల రూపాయలు ఇస్తారు. వాళ్లకు కూడా డబ్బులు ఇవ్వకపోతే పిల్లల్ని ఇంటికి పంపిస్తున్నారు. ఎంత దిక్కుమాలిన ప్రభుత్వమంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో డైట్ చార్జీలు చెల్లించకపోతే సప్లయర్స్ కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్ కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం ముఖ్యమంత్రి...

కేటీఆర్ బ‌క్వాస్‌..

కేటీఆర్ బ‌క్వాస్‌.. ఆయ‌న మాట‌లు న‌మ్మొద్దు వ‌చ్చే ఐదేండ్లు రేవంత్ సీఎంగా ఉంటారు న‌వీన్ యాదవ్‌ను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img